ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ఎన్నారైల ఉత్సాహం.. అపూర్వం
- September 26, 2016
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలో ప్రవాస భారతీయులు చూపించిన ఉత్సాహం అపూర్వమని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం మధ్యాహ్నం ట్వీట్ చేశారు. ''ఎన్నారై సోదరులు, సోదరీమణులు ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో చూపిస్తున్న ఉత్సాహం.. హోదాపై పోరులో నా విశ్వాసాన్ని రెట్టింపు చేసింది. మీలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు'' అని ఆయన తన ట్వీట్లో (@ysjagan) పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పష్టంగా చెప్పినా, దాన్ని స్వాగతిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడాన్ని పలువురు ఎన్నారైలతో పాటు విద్యార్థులు కూడా తీవ్రంగా తప్పుబట్టిన విషయం తెలిసిందే.ఆదివారం రాత్రి ఈ అంశంపై వైఎస్ జగన్ నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ప్రవాస భారతీయులు పలు దేశాల నుంచి ఉత్సాహంగా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







