ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ఎన్నారైల ఉత్సాహం.. అపూర్వం
- September 26, 2016
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలో ప్రవాస భారతీయులు చూపించిన ఉత్సాహం అపూర్వమని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం మధ్యాహ్నం ట్వీట్ చేశారు. ''ఎన్నారై సోదరులు, సోదరీమణులు ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో చూపిస్తున్న ఉత్సాహం.. హోదాపై పోరులో నా విశ్వాసాన్ని రెట్టింపు చేసింది. మీలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు'' అని ఆయన తన ట్వీట్లో (@ysjagan) పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పష్టంగా చెప్పినా, దాన్ని స్వాగతిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడాన్ని పలువురు ఎన్నారైలతో పాటు విద్యార్థులు కూడా తీవ్రంగా తప్పుబట్టిన విషయం తెలిసిందే.ఆదివారం రాత్రి ఈ అంశంపై వైఎస్ జగన్ నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ప్రవాస భారతీయులు పలు దేశాల నుంచి ఉత్సాహంగా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









