యుద్ధం అంటూ జరిగేతే భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం ఖాయం...

- September 26, 2016 , by Maagulf
యుద్ధం అంటూ జరిగేతే భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం ఖాయం...

ఉగ్రవాదంపై ప్రధాని నరేంద్ర మోదీ ఘాటు స్పందనతో పాక్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వాటిని తిప్పికొట్టేందుకు పాక్ దౌత్యవేత్తలు తలమునకలవుతున్నారు. ఉగ్రవాదులకు అడ్డాగా మారిన పాకిస్తాన్‌ను ఒంటరి చేయాలనుకుంటున్న భారత్‌ కల ఎప్పటికీ నెరవేరదని పాక్ దౌత్యవేత్త ఒకరు అన్నారు. భారత్ యుద్ధానికి దిగదని, యుద్ధమంటూ జరిగితే దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందన్న విషయం వారికి బాగా తెలుసునని ఆయన పేర్కొన్నారు. ఈ కథనాన్ని దౌత్యవేత్త పేరు ప్రస్తావించకుండా 'డాన్' పత్రిక ప్రచురించింది. 'యుద్ధం ఉండకపోవచ్చు. మేము యుద్ధం మొదలుపెట్టాలని అనుకోవడం లేదు. ఈ దశలో యుద్ధం అంటూ జరిగేతే భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం ఖాయం.అందుకే భారత్ కూడా యుద్ధాన్ని ఎంచుకోదు' అని పాక్ దౌత్యవేత్త అభిప్రాయపడినట్టు ఆ కథనం పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com