స్కూల్ బస్ ఫీజులపై పేరెంట్స్ ఫిర్యాదు
- September 26, 2016
జెడ్డా: జెడ్డాలో స్కూల్ బస్ ఫీజుల్ని 21.4 శాతం మేర పెంచారు. ఒక్కో విద్యార్థికీ 700 సౌదీ రియాల్స్ నుంచి 850 సౌదీ రియాల్స్ వరకూ ఫీజులు పెరిగాయి. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమవుతున్న తరుణంలో ఈ ఫీజుల పెంపు విద్యార్థుల తల్లిదండ్రులకు ఇబ్బందికరంగా మారింది. అయితే వాహన ఇన్స్యూరెన్స్, ఉద్యోగుల జీతాలు వంటివాటి దృష్ట్యా ఫీజుల్ని పెంచాల్సి వచ్చిందని ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఓనర్ అబ్దుల్ రహమాన్ అల్ మోట్లాగ్ చెప్పారు. మరో ట్రాన్స్పోర్ట్ కంపెనీ డైరెక్టర్ మొహమ్మద్ అల్ జహ్రి మాట్లాడుతూ, 15 నుంచి 20 శాతం మేర ఫీజులు పరిగినట్లు చెప్పారు. ఉద్యోగుల జీతాల కారణంగానే ఈ పెరుగుదల తప్పడంలేదని ఆయన వివరించారు. అయితే విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం పెరిగిన స్కూల్ బస్ ఫీజుల పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ తక్కువ ఫీజులతోనే తగిన ట్రాన్స్పోర్టేషన్ సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా వారు కోరుతున్నారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







