పాక్‌పై ఆన్‌లైన్‌ పిటీషన్‌కు నెటిజన్లు మంచి స్పందన...

- September 27, 2016 , by Maagulf
పాక్‌పై ఆన్‌లైన్‌ పిటీషన్‌కు నెటిజన్లు మంచి స్పందన...

పాకిస్థాన్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని కోరుతూ వుయ్‌ ద పీపుల్‌ కార్యక్రమంలో భాగంగా ఆన్‌లైన్‌లో దాఖలు చేసిన ఓ పిటీషన్‌కు నెటిజన్లు స్పందించారు. ఉగ్రవాదానికి పాకిస్థాన్‌ పెట్టుబడిదారుగా వ్యవహిరిస్తోందంటూ ఈనెల 21న ఇండో-అమెరికన్‌ పౌరులు ఆన్‌లైన్‌లో పిటీషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటీషన్‌ ఒబామా పరిశీలించాలంటే లక్ష సంతకాలు అవసరం. కాగా కేవలం ఐదు రోజుల్లోనే దాదాపు 82వేల మంది దీనికి మద్దతుగా సంతకాలు చేశారు. పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదుల కారణంగా భారత్‌తో పాటు పలు దేశాలు శాంతిభద్రతల సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్‌ సభ్యుడు, ఉగ్రవాదంపై హౌస్‌ సబ్‌కమిటీ ఛైర్మన్‌ టెడ్‌పోయ్‌, మరో కాంగ్రెస్‌ సభ్యుడు డానా రోహర్బాచర్‌లు ప్రారంభించారు.త్వరలోనే ఈ పిటీషన్‌ను అమెరికన్‌ కాంగ్రెస్‌ పరిశీలనకు ఉంచనున్నారు.పాక్‌ ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు సరైన సమయం వచ్చిందని వారు అభిప్రాయపడ్డారు. అక్టోబర్‌ 21లోపు ఈ పిటీషన్‌ను వైట్‌హౌస్‌ వెబ్‌సైట్‌కు అందజేయాలి. గడువు తేదీ కంటే ముందే తమ లక్ష సంతకాల లక్ష్యాన్ని చేరుకుంటామని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com