సెన్సార్ పూర్తి చేసుకున్న 'ప్రేమమ్ '

- September 27, 2016 , by Maagulf
సెన్సార్ పూర్తి చేసుకున్న 'ప్రేమమ్ '

చందు మొండేటి దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా నటించిన 'ప్రేమమ్‌' చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్డు ఒక్క కట్‌ కూడా లేకుండా యూ/ఏ సర్టిఫికెట్‌ ఇచ్చినట్లు చిత్ర బృందం తెలిపింది. చక్కటి ప్రేమకథను తెరకెక్కించినందుకు చిత్ర నిర్మాతలు, దర్శకుడ్ని సెన్సార్‌ బోర్డు సభ్యులు అభినందించారట. మలయాళంలో విజయం సాధించిన 'ప్రేమమ్‌' చిత్రాన్ని తెలుగులో అదే టైటిల్‌తో తెరకెక్కించారు.

శ్రుతిహాసన్‌, మడొన్నా సెబాస్టియన్‌, అనుపమ్‌ పరమేశ్వరన్‌ ఈ చిత్రంలో కథానాయికలుగా నటించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపైనిర్మించిన ఈ చిత్రాన్ని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com