10 శాతం పెరిగిన పర్యాటకులు

- September 28, 2016 , by Maagulf
10 శాతం పెరిగిన పర్యాటకులు

మనామా: కింగ్‌డమ్‌లోకి 2015లో అదనంగా 10 శాతం మంది (2014తో పోల్చితే) పర్యాటకులు విచ్చేసినట్లు బహ్రెయిన్‌ టూరిజం అండ్‌ ఎగ్జిబిషన్స్‌ అథారిటీ (బిటిఇఎ) వెల్లడించింది. ఈ సందర్భంగా సిఇ షేక్‌ ఖాలిద్‌ బిన్‌ హుమూద్‌ అల్‌ ఖలీఫా మాట్లాడుతూ, 2015లో 11.6 మిలియన్‌ టూరిస్టుల్ని కింగ్‌డమ్‌ ఆహ్వానించిందనీ, అంతకు ముందు సంవత్సరం అంటే 2014లో ఈ సంఖ్య 10.4గా ఉందని ఆయన తెలిపారు. యునైటెడ్‌ నేషన్స్‌ వరల్డ్‌ టూరిజం ఆర్గనైజేషన్‌ - వరల్డ్‌ టూరిజం డే సందర్భంగా ఈ వివరాల్ని వెల్లడించారు. హోటల్‌ ఆక్యుపెన్సీ 2015లో 52 శాతానికి చేరుకుందనీ, 2014లో ది 50 శాతం మాత్రమే ఉందని, 2013లో మరీ తక్కువగా 45 శాతం ఉందని గణాంకాలు చెబుతున్నాయి. యాత్రీకులు రోజువారీ ఖర్చు చేసే సరాసరి మొత్తాన్ని 110 బహ్రెయినీ దినార్స్‌గా పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని 2018 నాటికి 136 బహ్రెయినీ దినార్స్‌ వరకు పెంచేలా చర్యలు తీసుకుంటామని టూరిజం వర్గాలు వెల్లడించాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com