ఎలక్ట్రిసిటీ అండ్‌ వాటర్‌ అథారిటీ ఇ-బిల్లింగ్‌

- September 28, 2016 , by Maagulf
ఎలక్ట్రిసిటీ అండ్‌ వాటర్‌ అథారిటీ ఇ-బిల్లింగ్‌

మనామా: ఎలక్ట్రిసిటీ మరియు వాటర్‌ అథారిటీ (ఇడబ్ల్యుఎ) యుటిలిటీ బిల్స్‌ నవంబర్‌ నుంచి ఎలక్ట్రానిక్‌ విధానంలో జారీ చేయబడనున్నాయి. డిస్ట్రిబ్యూషన్‌ మరియు కస్టమర్‌ సర్వీసెస్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అద్నాన్‌ మొహమ్మద్‌ ఫక్రో మాట్లాడుతూ, డిసెంబర్‌ నాటికి పూర్తిగా పేపర్‌ బిల్లింగ్‌ పద్ధతిని తొలగించే అవకాశాలున్నాయని చెప్పారు. వినియోగదారులు తమ ఇ-మెయిల్‌ అడ్రస్‌, అలాగే ఫోన్‌ నెంబర్లను ఇడబ్ల్యుఎ సిస్టమ్‌లో అప్డఏట్‌ చేసుకోవాలనీ, తద్వారా బిల్లులు మిస్‌ అవడం, కనెక్షన్లు తొలగించబడటం వంటి చర్యలకు లోనుకాకుండా ఉంటారని ఆయన తెలిపారు. ఇడబ్ల్యుఎ-గ్రీన్‌ నినాదంలో భాగంగా ఇ-గవర్నమెంట్‌ అథారిటీ సమాయంతో ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com