అక్టోబర్ 1న రాగం ప్రీమియర్ షో...
- September 28, 2016
మల్టీ టాలెంటెడ్ యాక్ట్సెస్ సునీత ప్లే బ్యాక్ సింగర్ గా, యాంకర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో మంచి పేరు సంపాదించుకుంది. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన అనామిక చిత్రం ద్వారా వెండి తెరపై మెరిసిన సునీత ఇటీవల రాగం అనే షార్ట్ ఫిలిం లో నటించింది. ఇందులో సునీత పాత్ర జర్నలిస్టు అని తెలుస్తుంది. ఇక త్రివిక్రమ్ సినిమాలోను సునీత నటించనుందంటూ ఆ మధ్య వార్తలొచ్చాయి. అందం, అభినయం ఉన్నా కూడా నటనపై పెద్దగా ఆసక్తి చూపించని సునీత తాజాగా స్త్రీల సమస్యలపై పోరాటం చేయబోతున్న పాత్రలో నటించి మెప్పించేందుకు రెడీ అయింది. 'రాగం' పేరుతో తెరకెక్కిన ఈ షార్ట్ ఫిలిం తన లైఫ్కి దగ్గరగా ఉంటుందని, అందువల్లే చాలా సీన్స్ను సింగిల్ టేక్లో చేశానని అంటోంది.ఆ పిక్చర్ లో తన పాత్రకు పాటలు కూడా ఉన్నాయని తెలిపింది సునీత. ఇంకా ఈ సినిమాకు ఎక్కువ మంది మహిళలే పనిచేశారట. అక్టోబర్ 1న రాగం ప్రీమియర్ షోని ప్రదర్శించనున్నారట.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







