మొబైల్ ఫోన్లు దొంగిలించిన కేసులో నిర్వాసితునికి జైలు శిక్ష

- September 29, 2016 , by Maagulf
మొబైల్ ఫోన్లు దొంగిలించిన కేసులో నిర్వాసితునికి జైలు శిక్ష

మొబైల్ ఫోన్లు దొంగిలించిన కేసులో కెన్యా దేశానికీ చెందిన ఒక వ్యక్తికి దోహా క్రిమినల్ కోర్ట్ ఒక సంవత్సరం వరకు జైలుశిక్ష అనంతరం ఆ వ్యక్తిని  దేశ బహిష్కరణకు గురిచేస్తున్నట్లు ఆదేశించింది, నిందితుడు ఒక మహిళ యొక్క చేతి సంచి నుంచి 2,500 క్యూ ఆర్ లను  సిమ్ కార్డులతో సహా రెండు మొబైల్ ఫోన్లు దొంగిలించాడని దొంగిలించాడని కోర్టుకి ప్రాసిక్యూషన్ తెలిపింది. సంఘటన జరిగిన సమయంలో, ఒక హోటల్ రెస్టారెంట్ కు ఓ మహిళ విందుకు వెళ్ళింది. ఆమె టాయిలెట్ కు  వెళ్లినప్పుడు  టేబుల్ మీద ఆమె హ్యాండ్ బ్యాగ్ వదిలి వెళ్ళింది. ఇది గమనించిన నిందితుడు వాటిని అపహరించి అక్కడ్నించి పరారయ్యాడు. ఆ తర్వాత ఆ మహిళ పోలీసులు ఫిర్యాదు చేసింది. పోలీసులు రెస్టారెంట్ నిఘా కెమెరాల రికార్డింగ్ ఫుటేజ్ని సమీక్షించారు. ఆ వీడియోలలో కెన్యా దేశానికీ చెందిన ప్రతివాదిని గుర్తించారు.  గత సందర్భాలలో ఆ వ్యక్తి ఇదే మాదిరిగానే దొంగతనాలకు పాల్పడినట్లు తేలింది . ఆ వ్యక్తిని అరెస్ట్ చేసినపుడు రెండు ఫోన్లని  అతని నుండి స్వాధీనం చేసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com