'మజ్ను' విజయోత్సవ యాత్ర
- September 30, 2016
విశాఖ నగరంలో 'మజ్ను' చిత్ర యూనిట్ సందడి చేసింది. నాని కథానాయకుడిగా తెరకెక్కి ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన 'మజ్ను' హిట్టాక్తో దూసుకుపోతోంది. దీంతో ఉత్సాహంగా ఉన్న చిత్ర బృందం విశాఖ నుంచి విజయోత్సవ యాత్ర ప్రారంభించింది. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. 'మజ్ను' చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. విశాఖ తనకు సెంటిమెంట్ ప్రదేశమని.. తన అన్ని చిత్రాల విజయోత్సవ యాత్రలను ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఈ యాత్ర విశాఖలో ప్రారంభమై రాజమహేంద్రవరం, ఏలూరు, విజయవాడ మీదుగా హైదరాబాద్ చేరుకుంటుందని తెలిపారు.
ఈ ఏడాది 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' 'జెంటిల్మెన్' చిత్రాల ద్వారా విజయాలను అందుకున్న నాని 'మజ్ను'తో హ్యాట్రిక్ కొట్టాడు. 'ఉయ్యాల జంపాల' లాంటి స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమకథను తెరకెక్కించిన విరంచి వర్మ ఈ చిత్రానికి దర్శకుడు. నాని సరసన ఇమ్మాన్యుయేల్, ప్రియాశ్రీ హీరోయిన్లుగా నటించారు.
తాజా వార్తలు
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం









