పాకిస్థాన్‌లో భారత సినిమాల నిలిపివేత..

- September 30, 2016 , by Maagulf
పాకిస్థాన్‌లో భారత సినిమాల నిలిపివేత..

నియంత్రణ రేఖ వద్ద భారత సైన్యం చేపట్టిన లక్షిత దాడుల ఫలితంగా పాకిస్థాన్‌లో ప్రస్తుతం ఆడుతున్న భారతీయ సినిమాలన్నీ నిలిపివేశారు. లాహోర్‌ సూపర్‌సినిమా యాజమాన్యం భారత సినిమాలన్నీ నిలిపివేయనున్నట్లు ఫేస్‌బుక్‌ ద్వారా వెల్లడించిన వెంటనే కరాచీ న్యూప్లిక్స్‌ సినిమాస్‌ కూడా అదే పద్ధతిని అనుసరించింది. దాంతో భారత సినిమాల ప్రదర్శనలు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఈ రెండు థియేటర్లలో హాలీవుడ్‌ సినిమాలతో పాటు అమితాబ్‌ నటించిన పింక్‌ చిత్రం ఆడుతోంది. ఈ రెండు థియేటర్లు తమ నిర్ణయాలు వెల్లడించడంతో మిగతా థియేటర్లు కూడా భారత సినిమాల స్క్రీనింగ్‌లు నిలిపివేయనున్నాయి.

ఇదివరకు మహారాష్ట్ర నవ నిర్మాణ సేన పాక్‌ నటీనటులను దేశం విడిచి వెళ్లిపోవాల్సిందిగా హెచ్చరించింది. ఆ తర్వాత ఐఎమ్‌పీపీఏ(ఇండియన్‌ మోషన్‌ పిక్చర్‌ ప్రొడ్యూసర్స్‌ అసోసియేషన్‌) పాకిస్థాన్‌కి చెందిన నటీనటులను నిషేధిస్తున్నట్లు వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com