శ్రీనగర్ పట్టణంలో తిరిగి కర్ఫ్యూ ....
- September 30, 2016
శ్రీనగర్ పట్టణంలో శుక్రవారం తిరిగి కర్ఫ్యూ విధించారు. కశ్మీర్లోని లాల్చౌక్ను స్వాధీనం చేసుకుంటామని వేర్పాటువాదులు ప్రకటించడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కర్ఫ్యూ విధించినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. శుక్రవారం ప్రార్థనల అనంతరం గొడవలు జరగకుండా శ్రీనగర్ డౌన్టౌన్లోని 5 పోలీస్స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ విధించారు. ఈ క్రమంలో లాల్చౌక్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పలు చర్యలు తీసుకున్నారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు, పాఠశాలలు మూతపడ్డాయి. కశ్మీర్లోని మిగతా ప్రాంతాల్లో శాంతి భద్రతలు అదుపులో ఉంచేందుకు 144 సెక్షన్ను విధించారు.గత రెండు నెలలుగా కశ్మీర్లో జరిగిన అలర్లలో ఇద్దరు భద్రతా సిబ్బంది సహా 82 మంది మరణించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







