దసరా ఉత్సవాలకు ముస్తాబైన ఇంద్రకీలాద్రి
- September 30, 2016
బెజవాడ దుర్గమ్మ సన్నిధి దసరా ఉత్సవాలకు సిద్ధమైంది. గతానికి భిన్నంగా 11రోజుల పాటు జరిగే ఉత్సవాలకు ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. శనివారం ఉదయం స్నపనాభిషేకం అనంతరం తొమ్మిది గంటల నుంచి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. వినాయక ఆలయం నుంచి క్యూలైన్ల ద్వారా సాధారణ భక్తులను అనుమతిస్తారు. రూ.100 టికెట్ కొనుగోలు చేసిన వారిని దుర్గా ఘాట్ ఎదురుగా ఉన్న క్యూలైన్లలోకి పంపిస్తారు. రూ.300టిక్కెట్ కొన్నవారి కోసం ఓంకారం టర్నింగ్ నుంచి క్యూలైన్లు ఏర్పాటుచేశారు. వీఐపీలకు రూ.500 టికెట్ ఖరారు చేశారు. వారిని పున్నమి ఘాట్ నుంచి ప్రత్యేక వాహనాల్లో ఇంద్రకీలాద్రికి తీసుకొస్తారు.
తాజా వార్తలు
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్
- నగరాభివృద్ధి పనులపై సీఎం రేవంత్ సమీక్ష
- అమెరత్–బౌషర్ మౌంటేన్ రోడ్ రెండు రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష







