ఎయిర్‌ ఏసియా ఇండియా కొత్త ఆఫర్‌

- October 03, 2016 , by Maagulf
ఎయిర్‌ ఏసియా ఇండియా కొత్త ఆఫర్‌

సంవత్సరం చివరలో ఎయిర్‌ ఏసియా ఇండియా కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌ కింద టిక్కెట్లను రూ.899లకే విక్రయించనుంది. అక్టోబర్‌ 16తో ఈ ఆఫర్‌ ముగుస్తుంది. 2016 అక్టోబరు 4 నుంచి 2017 ఏప్రిల్‌ 27 మధ్య ప్రయాణాలకు ఈ ఆఫర్‌ కింద టికెట్లు కొనుక్కోవచ్చని ఎయిర్‌ ఏసియా తెలిపింది. రూ. 899 టికెట్‌ గౌహతి-ఇంఫాల్‌ మధ్య ప్రయాణానికి వర్తిస్తుంది. బెంగుళూరు-కొచ్చి టిక్కెట్టు ధర రూ.999లుగా సంస్థ ప్రకటించింది.

ఈ ఆఫర్‌లో భాగంగా బెంగళూరు-గోవా టిక్కెట్టు ధర రూ.1,199, బెంగళూరు-చండీగఢ్‌ రూ.3,399, గోవా-హైదరాబాద్‌ రూ.1,799, జైపూర్‌-పుణె రూ.2,399, దిల్లీ-బెంగుళూరు రూ.2,699లుగా ఉంది.

అక్టోబర్‌ 8 నుంచి కొచ్చి నుంచి హైదరాబాద్‌కు విమాన సర్వీసును నడపనున్నట్లు ఎయిర్‌ ఏసియా తెలిపింది. టిక్కెట్టు ధర రూ. 2,699 గా నిర్ణయించారు. చాలా విమాన సంస్థలు గతంలోనే తగ్గింపు ధరలను ఇవ్వడానికి ముందుకు వచ్చాయి.

దాంతో ఆగస్టులో విమాన ప్రయాణికులు 24 శాతం పెరిగారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com