పాకిస్థాన్‌లో అమానవీయ ఘటన....

- October 05, 2016 , by Maagulf
పాకిస్థాన్‌లో అమానవీయ ఘటన....

పాకిస్థాన్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. బస్సులో ప్రయాణిస్తున్న నలుగురు షియా తెగకు చెందిన మహిళలపై ఓ గుర్తుతెలియని అగంతకుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నలుగురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రెండు ద్విచక్ర వాహనాలపై బస్సును వెంబడించి, బస్సులోని మహిళలను టార్గెట్ చేసుకుని ఆ వ్యక్తి బుల్లెట్ల వర్షం కురిపించాడు. క్వెటా సిటీ శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తాలిబన్లే ఈ చర్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. షీతే తెగకు చెందిన వారిని లక్ష్యంగా చేసుకుని గతంలో కూడా తాలిబన్లు పలు చోట్ల దాడి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com