చాక్లెట్లు, పేపర్ ప్యాకెట్లలో హెరాయిన్ పెట్టి విమానాల ద్వారా గల్ఫ్ దేశాలకు రవాణా..
- October 06, 2016
దేశ రాజధాని న్యూఢిల్లీ కేంద్రంగా చాక్లెట్లు, పేపర్ ప్యాకెట్లలో హెరాయిన్ పెట్టి విమానాల ద్వారా గుట్టుగా గల్ఫ్ దేశాలకు రవాణా చేస్తున్నారని వెల్లడైంది. నెల రోజుల కాలంలో మూడు వేర్వేరు కేసుల్లో 12 కోట్ల రూపాయల హెరాయిన్ ను అధికారులు సీజ్ చేశారు. హెరాయిన్ అక్రమ రవాణా వ్యవహారంపై డైరెక్టర్ ఆఫ్ ఇంటలిజెన్స్ అధికారులు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులను అప్రమత్త చేశారు. సాధారణంగా హెరాయిన్ కిలో ధర కోటి రూపాయలుంటుంది.కాని గల్ఫ్ దేశాలకు అక్రమంగా రవాణా అవుతున్న నాణ్యమైన హెరాయిన్ ధర కిలో మూడుకోట్లరూపాయలని అధికారులు చెప్పారు. సాధారణంగా బంగారం అక్రమ రవాణా చేస్తుంటారని అందుకే తాము ప్రయాణికులపై నిఘా పెట్టామని అంటున్నారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







