చాక్లెట్లు, పేపర్ ప్యాకెట్లలో హెరాయిన్ పెట్టి విమానాల ద్వారా గల్ఫ్ దేశాలకు రవాణా..

- October 06, 2016 , by Maagulf
చాక్లెట్లు, పేపర్ ప్యాకెట్లలో హెరాయిన్ పెట్టి విమానాల ద్వారా  గల్ఫ్ దేశాలకు రవాణా..

దేశ రాజధాని న్యూఢిల్లీ కేంద్రంగా చాక్లెట్లు, పేపర్ ప్యాకెట్లలో హెరాయిన్ పెట్టి విమానాల ద్వారా గుట్టుగా గల్ఫ్ దేశాలకు రవాణా చేస్తున్నారని వెల్లడైంది. నెల రోజుల కాలంలో మూడు వేర్వేరు కేసుల్లో 12 కోట్ల రూపాయల హెరాయిన్ ను అధికారులు సీజ్ చేశారు. హెరాయిన్ అక్రమ రవాణా వ్యవహారంపై డైరెక్టర్ ఆఫ్ ఇంటలిజెన్స్ అధికారులు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులను అప్రమత్త చేశారు. సాధారణంగా హెరాయిన్ కిలో ధర కోటి రూపాయలుంటుంది.కాని గల్ఫ్ దేశాలకు అక్రమంగా రవాణా అవుతున్న నాణ్యమైన హెరాయిన్ ధర కిలో మూడుకోట్లరూపాయలని అధికారులు చెప్పారు. సాధారణంగా బంగారం అక్రమ రవాణా చేస్తుంటారని అందుకే తాము ప్రయాణికులపై నిఘా పెట్టామని అంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com