రొమ్ము క్యాన్సర్ అవగాహనా కార్యక్రమం ప్రారంభం
- October 06, 2016
రియాద్: రొమ్ము క్యాన్సర్ గూర్చి రాజ్యవ్యాప్తంగా ఒక విస్తృత అవగాహనను కల్పిస్తూ ఆదివారం ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో " పరీక్ష చేసుకొని సురక్షితంగా ఉండండి " ఒక కార్యక్రమం రాజధాని లో ప్రారంభించింది.
రొమ్ము క్యాన్సర్ కు వ్యతిరేకంగా జాతీయ ప్రచారం కొనసాగించి క్యాన్సర్ కారణాలు, దాని నివారణ పద్ధతులు గురించి అవగాహన కల్పించి మహిళలకు ఆరోగ్య సహాయం చేసి తద్వారా రాజ్యంలో రొమ్ము క్యాన్సర్ వ్యాధిగ్రస్తులను తగ్గించేందుకు ప్రారంభించిన అవగాహన సదస్సుకు విశేష స్పందన లభిస్తుంది. మమ్మోగ్రామ్ పరీక్ష ద్వారా రొమ్ము కాన్సెర్ ప్రారంభ గుర్తింపును తెలుసుకోవచ్చని " ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 18 నుంచి 60 సంవత్సరాల వయసు మధ్య మహిళలను లక్ష్యంగా ఈ అవగాహన కార్యక్రమం కొనసాగించనున్నారు.రొమ్ము కాన్సెర్ వ్యాధి రావడానికి కుటుంబ చరిత్రని సైతం పరిశీలిస్తారు. రొమ్ము కాన్సెర్ వ్యాధిని తొలి దశలో కనుగొన్నట్లైతే పూర్తి చికిత్స కోసం అవకాశం 97 శాతం వరకు ఉందని తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో తొలిసారి అరబ్ మహిళలకు వర్తింపజేశారు. ఆ తర్వాత ప్రాంతీయ స్థాయిలో చేపడతారని తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..







