రొమ్ము క్యాన్సర్ అవగాహనా కార్యక్రమం ప్రారంభం

- October 06, 2016 , by Maagulf
రొమ్ము క్యాన్సర్ అవగాహనా కార్యక్రమం ప్రారంభం

రియాద్: రొమ్ము క్యాన్సర్ గూర్చి రాజ్యవ్యాప్తంగా ఒక విస్తృత  అవగాహనను కల్పిస్తూ ఆదివారం ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో  " పరీక్ష చేసుకొని సురక్షితంగా ఉండండి " ఒక కార్యక్రమం రాజధాని లో ప్రారంభించింది.

రొమ్ము క్యాన్సర్ కు వ్యతిరేకంగా జాతీయ ప్రచారం కొనసాగించి క్యాన్సర్ కారణాలు, దాని నివారణ పద్ధతులు గురించి అవగాహన కల్పించి మహిళలకు ఆరోగ్య సహాయం చేసి తద్వారా  రాజ్యంలో రొమ్ము క్యాన్సర్ వ్యాధిగ్రస్తులను తగ్గించేందుకు ప్రారంభించిన అవగాహన సదస్సుకు విశేష స్పందన లభిస్తుంది.    మమ్మోగ్రామ్ పరీక్ష ద్వారా రొమ్ము కాన్సెర్  ప్రారంభ గుర్తింపును తెలుసుకోవచ్చని " ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 18 నుంచి 60 సంవత్సరాల వయసు మధ్య మహిళలను లక్ష్యంగా ఈ అవగాహన కార్యక్రమం కొనసాగించనున్నారు.రొమ్ము కాన్సెర్ వ్యాధి రావడానికి కుటుంబ చరిత్రని సైతం పరిశీలిస్తారు. రొమ్ము కాన్సెర్ వ్యాధిని తొలి దశలో కనుగొన్నట్లైతే  పూర్తి చికిత్స కోసం అవకాశం  97 శాతం వరకు ఉందని తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో తొలిసారి అరబ్ మహిళలకు వర్తింపజేశారు. ఆ తర్వాత ప్రాంతీయ స్థాయిలో చేపడతారని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com