షార్జా బిల్డింగ్లోకి దూసుకెళ్ళిన ట్రక్: నలుగురికి గాయాలు
- October 06, 2016
షార్జా: నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డ ఘటన షార్జాలో చోటుచేసుకుంది. బుధవారం రాత్రి ఓ ట్రక్కు వేగంగా దూసుకొచ్చి, ఓ బిల్డింగ్ని ఢీకొందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న చాలా దుకాణాల్ని, అలాగే వాహనాల్ని ఆ ట్రక్ ధ్వంసం చేసినట్లు వారు చెప్పారు. ప్రమాదం గురించి తెలియగానే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటనా స్థలంలోనే ఓ షాపులో హెల్పర్గా పనిచేస్తున్న సునీల్ అనే వ్యక్తి సంఘటన గురించి వివరిస్తూ, డిన్నర్ తర్వాత తాను నడుచుకుంటూ వెళుతుండగా, భారీ శబ్దం చోటు చేసుకుందని, వెళ్ళి చూస్తే అక్కడ ప్రమాదం జరిగిందని అన్నాడు. గాయపడ్డవారిని అంబులెన్స్లో తరలించారు. పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







