షార్జా బిల్డింగ్లోకి దూసుకెళ్ళిన ట్రక్: నలుగురికి గాయాలు
- October 06, 2016
షార్జా: నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డ ఘటన షార్జాలో చోటుచేసుకుంది. బుధవారం రాత్రి ఓ ట్రక్కు వేగంగా దూసుకొచ్చి, ఓ బిల్డింగ్ని ఢీకొందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న చాలా దుకాణాల్ని, అలాగే వాహనాల్ని ఆ ట్రక్ ధ్వంసం చేసినట్లు వారు చెప్పారు. ప్రమాదం గురించి తెలియగానే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటనా స్థలంలోనే ఓ షాపులో హెల్పర్గా పనిచేస్తున్న సునీల్ అనే వ్యక్తి సంఘటన గురించి వివరిస్తూ, డిన్నర్ తర్వాత తాను నడుచుకుంటూ వెళుతుండగా, భారీ శబ్దం చోటు చేసుకుందని, వెళ్ళి చూస్తే అక్కడ ప్రమాదం జరిగిందని అన్నాడు. గాయపడ్డవారిని అంబులెన్స్లో తరలించారు. పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









