అటామా సరిహద్దు క్రాసింగ్ వద్ద పేలుడు.....
- October 06, 2016
టర్కీ-సిరియా సరిహద్దు ప్రాంతంలో గురువారం సంభవించిన భారీ పేలుడులో కనీసం 40 మంది మరణించినట్లు అల్ మయాదీన్ టీవీ ఛానల్ వెల్లడించింది. అటామా సరిహద్దు క్రాసింగ్ వద్ద సిరియా తిరుగుబాటుదారులను లక్ష్యంగా చేసుకుని ఈ పేలుడు జరిగిందని ఈ టీవీ ఛానల్ తన వార్తా కథనంలో వివరించింది. ఈ పేలుడుకు తామే బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించిన ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) మిలిటెంట్ గ్రూప్ తమ ఆత్మాహుతి దళ సభ్యుడొకరు పేలుడు పదార్ధాలతో నిండిన కారుతో సరిహద్దు ప్రాంతం వద్ద దాడి చేసినట్లు వెల్లడించింది. ఈ సరిహద్దు ప్రాంతం సిరియా ఉత్తరాన వున్న ఇడ్లిబ్ ప్రావిన్స్లో వుంది. తొలుత ఈ దాడిలో 20 మంది రెబల్స్ ప్రాణాలు కోల్పోయినట్లు లండన్కు చెందిన సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ వెల్లడించింది.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







