అటామా సరిహద్దు క్రాసింగ్ వద్ద పేలుడు.....
- October 06, 2016
టర్కీ-సిరియా సరిహద్దు ప్రాంతంలో గురువారం సంభవించిన భారీ పేలుడులో కనీసం 40 మంది మరణించినట్లు అల్ మయాదీన్ టీవీ ఛానల్ వెల్లడించింది. అటామా సరిహద్దు క్రాసింగ్ వద్ద సిరియా తిరుగుబాటుదారులను లక్ష్యంగా చేసుకుని ఈ పేలుడు జరిగిందని ఈ టీవీ ఛానల్ తన వార్తా కథనంలో వివరించింది. ఈ పేలుడుకు తామే బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించిన ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) మిలిటెంట్ గ్రూప్ తమ ఆత్మాహుతి దళ సభ్యుడొకరు పేలుడు పదార్ధాలతో నిండిన కారుతో సరిహద్దు ప్రాంతం వద్ద దాడి చేసినట్లు వెల్లడించింది. ఈ సరిహద్దు ప్రాంతం సిరియా ఉత్తరాన వున్న ఇడ్లిబ్ ప్రావిన్స్లో వుంది. తొలుత ఈ దాడిలో 20 మంది రెబల్స్ ప్రాణాలు కోల్పోయినట్లు లండన్కు చెందిన సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ వెల్లడించింది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









