ముప్పు పొంచి ఉన్న విమానాశ్రయాల వద్ద భద్రత..
- October 07, 2016
దేశరాజధాని దిల్లీ సహా 22 నగరాల్లో విమానాశ్రయాలకు ఉగ్రముప్పు పొంచివుందని నిఘావర్గాలు హెచ్చరించాయి. ముప్పు పొంచి ఉన్న విమానాశ్రయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని కేంద్రానికి నిఘా వర్గాలు సూచించాయి. పాకిస్థాన్తో సరిహద్దు ఉన్న జమ్ముకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లోని 22 విమానాశ్రయాలకు ముప్పు పొంచి ఉన్నట్లు నిఘావర్గాలు పేర్కొన్నాయి. దీంతో ప్రయాణికుల బ్యాగులతోపాటు పార్కింగ్ ప్రదేశాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరింత పటిష్ఠ భద్రత కల్పించాలని కోరుతూ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ బ్యూరో ఇప్పటికే ఆయా రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులకు లేఖలు రాసింది.గురురువారం ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమావేశమై నియంత్రణ రేఖ వెంబడి పరిస్థితులను వివరించారు. నిఘా వర్గాల సమాచారం మేరకు సుమారు 100 మంది ఉగ్రవాదులు దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారని దోవల్ ప్రధానికి తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









