భారత్ - పాకిస్థాన్ సరిహద్దును 2018, డిసెంబర్ నాటికి మూసివేస్తాo..
- October 07, 2016
భారత్ - పాకిస్థాన్ సరిహద్దును 2018, డిసెంబర్ నాటికి మూసివేస్తామని, దీనిపై ఆలోచిస్తున్నామని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. జైసల్మేర్లో సరిహద్దు రాష్ర్టాలైన పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, జమ్మూకశ్మీర్ సీఎంలు, హోంమంత్రులతో భద్రతపై సమీక్షించిన అనంతరం రాజ్నాథ్ మీడియాతో మాట్లాడారు. దేశ భద్రత విషయంలో రాజీపడబోమని స్పష్టం చేశారు. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అందరం ఐకమత్యంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. భారత సైనికులపై పూర్తి విశ్వాసం, నమ్మకం ఉందని చెప్పారు. దాడులకు పాల్పడే వారికి కచ్చితంగా శిక్ష పడాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. సరిహద్దుల్లో పరిస్థితిపై నెలవారీగా, మూడు నెలలకోసారి సమీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.ఎన్ఎస్ఏ, బీఎస్ఎఫ్ బలగాలతో నిరంతర సమీక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. బోర్డర్ సెక్కూరిటీ గ్రిడ్ విధానాన్ని ప్రవేశపెట్టి.. సరిహద్దు రాష్ర్టాల నుంచి ఎప్పటికప్పుడు భద్రతపై సమాచారాన్ని సేకరిస్తామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







