రైలులో బాంబు పేలుడు

- October 07, 2016 , by Maagulf
రైలులో బాంబు పేలుడు

బెలూచిస్థాన్‌లో కొద్దిసేపటికి ఓ రైలులో బాంబుపేలుడు సంభవించింది. రావల్పిండి స్టేషన్ నుంచి నడిచే జాఫర్ ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన ఈ పేలుడులో ఐదుగురు దుర్మరణం పాలవగా మరో 17 మంది తీవ్రంగా గాయపడినట్టు రైల్వే అధికారులు పేర్కొన్నారు. బలూచిస్థాన్ బోలన్ జిల్లాలోని అబ్-ఇ-గమ్ ప్రాంతంలో రైల్వే ట్రాక్ వెంబడి పెట్టిన బాంబులు పేలడంతో ఈ ఘటన సంభవించినట్టు ప్రాథమిక ఆధారాలను బట్టి తెలుస్తోంది. తొలి బాంబు పేలిన 20 నిమిషాల తర్వాత అదే ప్రాంతంలో మరో బాంబు పేలుడు సంభవించింది. క్షతగాత్రులను వెంటనే క్వెట్టాలోని ఆస్పత్రికి తరలించారు. బాంబు పేలుళ్లను ఖండించిన బలూచిస్థాన్ ముఖ్యమంత్రి సనౌల్లా జెహ్రీ ఘటనపై విచారణకు ఆదేశించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com