రైలులో బాంబు పేలుడు
- October 07, 2016
బెలూచిస్థాన్లో కొద్దిసేపటికి ఓ రైలులో బాంబుపేలుడు సంభవించింది. రావల్పిండి స్టేషన్ నుంచి నడిచే జాఫర్ ఎక్స్ప్రెస్లో జరిగిన ఈ పేలుడులో ఐదుగురు దుర్మరణం పాలవగా మరో 17 మంది తీవ్రంగా గాయపడినట్టు రైల్వే అధికారులు పేర్కొన్నారు. బలూచిస్థాన్ బోలన్ జిల్లాలోని అబ్-ఇ-గమ్ ప్రాంతంలో రైల్వే ట్రాక్ వెంబడి పెట్టిన బాంబులు పేలడంతో ఈ ఘటన సంభవించినట్టు ప్రాథమిక ఆధారాలను బట్టి తెలుస్తోంది. తొలి బాంబు పేలిన 20 నిమిషాల తర్వాత అదే ప్రాంతంలో మరో బాంబు పేలుడు సంభవించింది. క్షతగాత్రులను వెంటనే క్వెట్టాలోని ఆస్పత్రికి తరలించారు. బాంబు పేలుళ్లను ఖండించిన బలూచిస్థాన్ ముఖ్యమంత్రి సనౌల్లా జెహ్రీ ఘటనపై విచారణకు ఆదేశించారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









