చైనాలో కొండచరియలు విరిగిపడి 17 మంది మృతి
- October 07, 2016
చైనాలో కొండచరియలు విరిగిపడి 17 మంది మృతి చెందారు. తూర్పు చైనాలోని ఝెజియాంగ్ ప్రావిన్స్లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మేగి తుఫాను చైనాను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ టైఫూన్ కారణంగా ఈ ప్రాంతం తీవ్రంగా నష్టపోయింది. దాదాపు 3.15 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వారందరూ సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లిపోయినట్టు అధికారులు తెలిపారు. టైఫూన్ కారణంగా కొండ చరియల నుంచి వచ్చిన 4 లక్షల క్యూబిక్ మీటర్ల చెత్త సుయ్చాంగ్ కౌంటీలోని సుచాన్ గ్రామంలో పేరుకుపోయింది. బుధవారం ఏకంగా 20 గృహాలు పూర్తిగా శిథిలమై సమాధి అయిపోయాయి. ఈ ఘటనలో 27 మంది గల్లంతుకాగా 17 మంది మృత్యువాత పడినట్టు ఉన్నతాధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







