చైనాలో కొండచరియలు విరిగిపడి 17 మంది మృతి

- October 07, 2016 , by Maagulf
చైనాలో కొండచరియలు విరిగిపడి 17 మంది మృతి

చైనాలో కొండచరియలు విరిగిపడి 17 మంది మృతి చెందారు. తూర్పు చైనాలోని ఝెజియాంగ్ ప్రావిన్స్‌లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మేగి తుఫాను చైనాను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ టైఫూన్ కారణంగా ఈ ప్రాంతం తీవ్రంగా నష్టపోయింది. దాదాపు 3.15 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వారందరూ సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లిపోయినట్టు అధికారులు తెలిపారు. టైఫూన్ కారణంగా కొండ చరియల నుంచి వచ్చిన 4 లక్షల క్యూబిక్ మీటర్ల చెత్త సుయ్‌చాంగ్ కౌంటీలోని సుచాన్ గ్రామంలో పేరుకుపోయింది. బుధవారం ఏకంగా 20 గృహాలు పూర్తిగా శిథిలమై సమాధి అయిపోయాయి. ఈ ఘటనలో 27 మంది గల్లంతుకాగా 17 మంది మృత్యువాత పడినట్టు ఉన్నతాధికారులు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com