చైనాలో కొండచరియలు విరిగిపడి 17 మంది మృతి
- October 07, 2016
చైనాలో కొండచరియలు విరిగిపడి 17 మంది మృతి చెందారు. తూర్పు చైనాలోని ఝెజియాంగ్ ప్రావిన్స్లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మేగి తుఫాను చైనాను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ టైఫూన్ కారణంగా ఈ ప్రాంతం తీవ్రంగా నష్టపోయింది. దాదాపు 3.15 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వారందరూ సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లిపోయినట్టు అధికారులు తెలిపారు. టైఫూన్ కారణంగా కొండ చరియల నుంచి వచ్చిన 4 లక్షల క్యూబిక్ మీటర్ల చెత్త సుయ్చాంగ్ కౌంటీలోని సుచాన్ గ్రామంలో పేరుకుపోయింది. బుధవారం ఏకంగా 20 గృహాలు పూర్తిగా శిథిలమై సమాధి అయిపోయాయి. ఈ ఘటనలో 27 మంది గల్లంతుకాగా 17 మంది మృత్యువాత పడినట్టు ఉన్నతాధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









