'ఇండిగో' ఎయిర్లైన్స్ వారి పండగ ఆఫర్

- October 07, 2016 , by Maagulf
'ఇండిగో' ఎయిర్లైన్స్ వారి పండగ ఆఫర్

పండగల సీజన్‌లో టిక్కెట్‌ ధరలను తగ్గించే జాబితాలో ఇప్పుడు ఇండిగో కూడా చేరింది. ఒక వైపు ఛార్జీలను అన్నింటిని కలిపి రూ.888లకే ఇవ్వడానికి ఇండిగో సిద్ధమైంది. ఈ అవకాశం అక్టోబర్‌ 8 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఆఫర్‌ 2017 ఏప్రిల్‌ 13 వరకు వర్తిస్తుంది. అయితే ఎన్ని సీట్లకు ఈ ఆఫర్‌ను ఇచ్చింది పేర్కొనలేదు. ఇండిగో అధికారిక వైబ్‌సైట్‌లలో దిల్లీ-జయపుర రూట్ల మధ్య వచ్చే సంవత్సరం జనవరి నుంచి టిక్కెట్టు ధర రూ. 888గా పేర్కొన్నారు. దిల్లీ-ముంబయి ఎకానమీ క్లాస్‌ టిక్కెట్టు ధరలు కూడా రూ.2,152లుగా ఉన్నాయి. అయితే ప్రస్తుతం వాటి ధర రూ.5,642గా ఉంది. అయితే ఇప్పటికే విస్తారా, స్పైస్‌జేట్‌,ఎయిర్‌ఏషియా ఇండియా, జెట్‌ ఎయిర్‌వేస్‌ పండగ ఆఫర్లతో ముందుకు వచ్చాయి.

వీటి రాయితీ ఆఫర్లు అన్ని కూడా వచ్చే సంవత్సరం ఏప్రిల్‌ వరకు వర్తించే విధంగా ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com