బుల్లితెరపై నటించనున్న శ్వేతాబసు
- October 08, 2016
కొత్త బంగారు లోకం' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై కథానాయికగా మంచి గుర్తింపు తెచుకున్న నటి శ్వేతాబసు ప్రసాద్. ఉత్తమ బాలనటిగా జాతీయ అవార్డు పొందిన ఆమె గత కొద్ది కాలంగా వెండితెరకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె బుల్లితెరపై ప్రసారం కానున్న సీరియల్లో నటిస్తున్నారు. అక్టోబరు 10 నుంచి స్టార్ ప్లస్లో ప్రసారం కాబోతున్న సీరియల్లో చంద్రగుప్త మౌర్య భార్య చంద్ర-నందిని అనే పాత్రలో శ్వేత కనిపించనున్నారు. బుల్లితెర అనుభవం గురించి ఆమె మాట్లాడుతూ.. 'నటీనటులకు ఇది ఎగ్జైటింగ్ సమయం. టీవీల్లో షోను బట్టి విభిన్నమైన పాత్రలుంటాయి. ఇప్పుడు వాటిని నేను చేస్తున్నా.టీవీ షోలు ఇతివృత్తం ఆధారంగా చాలా క్లుప్తంగా ఉంటాయి, కథలు విభిన్నంగా ఉంటాయి. టెలివిజన్ నటీనటులకు ఇది చాలా ఎగ్జైటింగ్ సమయం' అన్నారు.
అంతేకాదు చంద్ర-నందిని పాత్ర కోసం శ్వేత తెగ కసరత్తులు చేస్తున్నారట. ఇది యోధురాలైన రాణి పాత్ర కావడంతో దానికి తగ్గట్టు తన శరీరాన్ని మలుచుకుంటున్నట్లు తెలిపారు.
త్వరలో కత్తియుద్ధం, గుర్రపు స్వారీ కూడా నేర్చుకోవాల్సి ఉందన్నారు. ఈ క్రమంలోనే మగధ, మౌర్య చరిత్రను చదివినట్లు చెప్పారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







