శ్రీలంక మెయిడ్‌కి 45,000 సౌదీ రియాల్స్‌

- October 08, 2016 , by Maagulf
శ్రీలంక మెయిడ్‌కి 45,000 సౌదీ రియాల్స్‌

భారతీయ మహిళ, సౌదీ అరేబియాకి శ్రీలంక పాస్‌పోర్ట్‌ ద్వారా హౌస్‌మెయిడ్‌గా వచ్చిన ఘటన వెలుగు చూసింది. ఈ ఘటనలో బాధితురాలు 14 ఏళ్ళపాటు సౌదీ అరేబియాలో పనిచేస్తూ, తీవ్ర దుర్భిక్షాన్ని ఎదుర్కొంది. కేదేశ్వరి సెల్లముత్తు అనే ఈ మహిళ తమిళనాడులోని చెన్నయ్‌ నుంచి శ్రీలంకకు చేరుకుంది. అక్కడి నుంచి ఆమె శ్రీలంక పాస్‌పోర్ట్‌పై సౌదీ వెళ్ళింది. జరీనా సాలీ పేరుతో ఆమెను కొందరు సౌదీకి పంపించారు. అక్కడే ఆమెతో 14 ఏళ్ళపాటు పనికి కుదిర్చారు. విషయం వెలుగు చూడ్డంతో ఆమెకు విముక్తి కల్పించారు. ఈ క్రమంలో కేదేశ్వరి సెల్లముత్తుకి 45,000 సౌదీ రియాల్స్‌ని ఇప్పించారు. ఆమె చేసిన పనికి అది వేతనం. శ్రీలంక ఎంబసీ సహాయంతో కేదేశ్వరి బయటపడింది. తనతోపాటు మరికొందరు ఇలాగే శ్రీలంక నుంచి వేరే పేర్లతో సౌదీకి వచ్చారని ఆమె తెలిపింది. హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ఎంత హేయంగా జరుగుతుందో చెప్పడానికి ఇది ఒక నిదర్శనమని అధికారిక వర్గాలు చెప్పాయి. సౌదీలో ఉద్యోగాలిస్తామని చెప్పి 25,000 సౌదీ రియాల్స్‌కి బేరం కుదుర్చుకుని, 15,000 సౌదీ రియాల్స్‌ మాత్రమే చెల్లించి అక్రమ మార్గాల్లో అక్కడికి మహిళలు పంపుతున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉందని శ్రీలంక డిప్యూటీ ఫారిన్‌ మినిస్టర్‌ హర్సా డిసిల్వా చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com