లక్ష్మి పన్యాల బొమ్మల కొలువు
- October 08, 2016
సౌతిండియాలో బొమ్మల కొలువుకు విశేష ప్రాధాన్యత ఉంది. దసరా సందర్భంగా ఎక్కువగా ఈ బొమ్మల కొలువులు దర్శనమిస్తాయి. దుబాయ్లో లక్ష్మి పన్యాల, అక్కడి భారతీయులకు స్వదేశంలో ఉన్నట్లుగా అనిపించేలా బొమ్మల కొలువుని నిర్వహిస్తున్నారు. తన ఇంట్లో ఈ మేరకు బొమ్మల కొలువుని ఏర్పాటు చేసి, అందర్నీ ఆహ్వానిస్తున్నారు. అల్ ఖాసిమియా, షార్జాలోని అల్ బుస్తాన్ హొటల్ వెనుక, హిస్సా సూపర్ మార్కెట్ ఎదురుగా ఉన్న మజీద్ బిల్డింగ్లోని ఫ్లాట్ నెంబర్ 602లో ఈ బొమ్మల కొలువుని ఏర్పాటు చేశారు. బొమ్మల కొలువులో పెళ్ళి గాజుల సందడి, గౌరీ పూజ, మెహందీ, ఎదురు సన్హాము, సప్తపది, కన్యాదానము, తలంబ్రాలు, విందు భోజనం వంటివి అందంగా కవర్ చేయబడ్డాయి ఈ బొమ్మల కొలువులో. అట్లంటిస్ హోటల్ని కవర్ చేస్తూ దుబాయ్ సిటీని కూడా ఈ బొమ్మల కొలువులో ఏర్పాటు చేశారు. బుర్జ్ ఖలీఫా, డిజర్ట్ సఫారి, మిరాకిల్ గార్డెన్, దుబాయ్ ఎయిర్పోర్ట్ వంటివి కూడా ఈ బొమ్మల కొలువులో ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి. బొమ్మల కొలువుని చూస్తే, నిజంగా ఆ లోకంలోకి మనం వెళ్ళిపోయేలా లక్ష్మి పన్యాల, ఆమె భర్త శ్రీనివాస్ పన్యాల ఈ ఈవెంట్ని ఏర్పాటు చేయడం గమనించదగ్గది. దేశాలు దాటినా మన సంస్కృతీ సంప్రదాయాల్ని ప్రతిబింబించేలా చేయడంలో మన తెలుగువారు మిగతావారందరికీ ఎప్పుడూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
_1475947404.jpg)
_1475947426.jpg)




తాజా వార్తలు
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!







