సుకుమార్ క్లాప్ ప్రిన్సిపాల్ ప్రసాద్ నిర్మాతగా...
- October 08, 2016
''లెక్చరర్గా నేనూ, ప్రిన్సిపాల్గా ప్రసాద్ ఒకే కాలేజీలో పని చేశాం. ఇద్దరికీ సినిమాలంటే ఇష్టం. ఈ సినిమాతో ప్రసాద్ నిర్మాతగా ప్రవేశిస్తున్నారు. మంచి సినిమా అవుతుందనే నమ్మకం ఉంది'' అని దర్శకుడు సుకుమార్ అన్నారు. విజయ్రామ్, శివశక్తి సచ్దేవ్ జంటగా జొనాథన్ ఎడ్వర్డ్స్ దర్శకత్వంలో వీఆర్ చలన చిత్రాలు పతాకంపై వీఈవీకేడీఎస్ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా శనివారం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు సుకుమార్ క్లాప్ ఇవ్వగా, కె.రామ్మోహన్రెడ్డి కెమేరా స్విచ్చాన్ చేశారు.సీనియర్ నరేశ్ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు థామస్రెడ్డి, విజయ్ప్రసాద్ స్క్రిప్ట్ అందజేశారు.''సుకుమార్తో పాతికేళ్ల అనుబంధం నాది. చక్కటి కథ, కథనాలతో కుటుంబమంతా కలసి చూడదగ్గ అంశాలతో ఈ సినిమా చేస్తున్నాం'' అన్నారు నిర్మాత ప్రసాద్. ''గులాబీ', 'గీతాంజలి', 'సఖి' తరహా ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి'' అని జొనాథన్ అన్నారు. విజయ్రామ్, శివశక్తి సచ్దేవ్, సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్, సంగీత దర్శకుడు రధన్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక







