కశ్మీర్లో మళ్లీ ఉగ్రవాదులు పంజా విసిరారు
- October 10, 2016
కశ్మీర్లో మళ్లీ ఉగ్రవాదులు పంజా విసిరారు. అప్రమత్తమైన భద్రతాదళాలు ఎదురుకాల్పులు జరపడంతో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్టు సమాచారం. ఈ ఎన్కౌంటర్లో ఒక ఆర్మీ జవాను, మరో పోలీసు గాయపడ్డారు. ప్రభుత్వ భవనంలో ఇంకా ఇద్దరు ఉగ్రవాదులు దాక్కున్నట్టు భావిస్తుండటంతో సైన్యం వారిని చుట్టుముట్టింది. తొలుత ఉగ్రవాదులు పాంపోర్లోని ఇడిఐ భవనంలో ఉన్నట్లు భద్రతాదళాలకు సమాచారం అందడంతో వారు ఆ భవనాన్ని, చుట్టుపక్కల ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. సైనికులను గుర్తించిన ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతాదళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ప్రస్తుతం కాల్పులు కొనసాగుతున్నాయి.కాగా, పోంపోర్లో ఉగ్రదాడి ఘటన, తాజా పరిస్థితిపై కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్కు ఆర్మీ చీఫ్ వివరించారు.
తాజా వార్తలు
- పర్యాటకులకు ఒమాన్ గుడ్ న్యూస్..
- అదనపు పన్నుల వాటా కేటాయింపు..కేంద్రానికి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు
- మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్
- తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) అధ్యక్షుడిగా నల్ల భాస్కర్ గుప్త ఏకగ్రీవ ఎన్నిక
- బాల్టిమోర్లో ఎన్ఆర్ఐ కమిటీతో మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖాముఖి
- దుబాయ్ పోలీస్ కొత్త డిజిటల్ సేవ..
- ప్రాంతీయ పరిస్థితులపై సల్మాన్–ట్రంప్ చర్చలు..!!
- 'ఈసా ది గ్రేట్'కు స్మారక పోస్టల్ స్టాంప్ విడుదల..!!
- కువైట్లో విజిట్ వీసాతో రెసిడెన్సీ పర్మిట్..KD150..!!
- ఒమాన్కు చేరిన నధీరా అల్ హార్థీ భౌతికకాయం..!!







