పనిమనిషికి తన పైశాచిక చేష్టలతో భూలోక నరకం చూపిస్తున్న యజమానురాలు
- October 10, 2016
బతుకు జీవనం కోసం అందరూ తమ తమ దేశాలు విడిచి వెళ్లినవారే...ఎడారి దేశం చేరుకొనేసరికి పైత్యం ప్రకోపిస్తుంది...హోదాలు...బడాయిలు కొని తెచ్చుకొని కొందరు తమ తోటివారిని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. విపరీత చేష్టలలో మరో ఆకు ఎక్కువ చదివిన ఓ 33 ఏళ్ల జోర్దానియాన్ యజమానురాలు ఇండోనేషియా దేశం నుంచి తన పనిమనిషిగా తెచ్చుకొన్న 28 ఏళ్ళ మహిళని తన పైశాచిక చేష్టలతో రాచి రంపాన పెట్టి హింసిస్తోంది. దుబాయ్ లో ఉంటున్నఈ యజమానురాలు..తన సైకో ప్రవర్తనతో పనిమనిషి ఎడమ చెవి లో కత్తెర నెట్టి గుండ్రంగా గిరా గిరా తిప్పడంతో ఆమె వినికిడి శక్తీ కోల్పోయింది..అలాగే వేడి వేడి ఇస్త్రీ పెట్టెను ఆమె శరీరంపై రుద్దడం...పొగలు కక్కే నీటిని ఆమెపై పోయడం వంటి ఎన్నో హింసలను పెట్టడంపై విసిగిపోయిన ఆ పనిమనిషి తన దేశమైన ఇండోనేషియా రాయబార కార్యాలయంకు వెళ్ళి పిర్యాదు చేసింది.
కోర్టులో ఆమెపై జరిగిన తీవ్రమైన భౌతిక దాడిని చార్జ్ చేసే సమయంలో ఖండించారు. అయితే ప్రాసిక్యూషన్ రికార్డుల ప్రకారం, గృహిణి తన పనిమనిషిని రాత్రివేళలో గదిలోపెట్టి తాళం వేస్తుందని అలాగే , తన భర్తతో బైటకు వెళ్ళినపుడు తన గదికి తాళం వెళ్లడం నిజమేనని ఒప్పుకొంది...అయితే పనిమనిషి తన పిల్లలను వంటరిగా ఆమె వద్ద విడిచి వెళ్తే ఆమె ఏమైనా చేస్తుందేమోనని తాళం వేసి వెళుతున్నట్లు పేర్కొంది. అలాగే తన పనిమనిషికి జూన్ 2015 నుండి ఈ సంవత్సరం మార్చి వరకు వేతనాన్నిఇవ్వడం లేదని పరిశోధకుల ముందు అంగీకరించారు. మూడు సంవత్సరాల క్రితం 28 ఏళ్ల ఇండోనేషియన్ మహిళ వారి వద్ద పని ప్రారంభించారు, తన యజమానురాలు నా పట్ల చేస్తున్న దురాగతాలు గూర్చి నా దేశం యొక్క కాన్సులేట్ ముఖ్యాధికారికి తెలిపినట్లు ఆ మహిళ చెప్పారు.ఆ గృహిణి కత్తులు, కత్తెరలు మరియు పాత్రలు ఉపయోగించడమే కాక పదునైన సాధనాలతో దాడి చేస్తుందని కాన్సులేట్ అధికారులకు ఆమె ఫిర్యాదు చేశారు. పలుమార్లు ఆమె గోడకి నా తలని కొట్టిందని నా జుట్టు పట్టుకొని లాగుతూ నా శరీరం మీద వేడినీరు పోయడం జరిగింది. ప్రతివాది హింసల వలన పనిమనిషి ఎడమ చెవి వినికిడి కోల్పోయింది," ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం చెవి గాయం కత్తెర ఫలితంగా ఏర్పడిందని తెలిసింది. . ఆమె ముఖం, తల, మెడ మరియు ఉదరం మీద ఇతర గుర్తులు ఆమె కత్తెర మరియు కత్తి లాంటి పదునైన పరికరాలతో దాడి జరిగినట్లు తేలింది.ఆమె వీపు, ఛాతీ, ఉదరం, చేతులు మరియు తొడ గాయం గుర్తులు ఆమెకి ఇస్త్రీ చేయడం ద్వారా శరీరం కమిలిపోయినట్లు సూచిస్తున్నాయి. పనిమనిషిని క్రమపద్ధతిలో సమయం ఒక నిర్దిష్ట కాలంలో హింసించారని ధ్రువీకరించారు.
తాజా వార్తలు
- పర్యాటకులకు ఒమాన్ గుడ్ న్యూస్..
- అదనపు పన్నుల వాటా కేటాయింపు..కేంద్రానికి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు
- మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్
- తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) అధ్యక్షుడిగా నల్ల భాస్కర్ గుప్త ఏకగ్రీవ ఎన్నిక
- బాల్టిమోర్లో ఎన్ఆర్ఐ కమిటీతో మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖాముఖి
- దుబాయ్ పోలీస్ కొత్త డిజిటల్ సేవ..
- ప్రాంతీయ పరిస్థితులపై సల్మాన్–ట్రంప్ చర్చలు..!!
- 'ఈసా ది గ్రేట్'కు స్మారక పోస్టల్ స్టాంప్ విడుదల..!!
- కువైట్లో విజిట్ వీసాతో రెసిడెన్సీ పర్మిట్..KD150..!!
- ఒమాన్కు చేరిన నధీరా అల్ హార్థీ భౌతికకాయం..!!







