సరిహద్దు దళం చేత 2 మిలియన్ల యాంఫేటమైన్ మాత్రలు పట్టివేత

- October 10, 2016 , by Maagulf
సరిహద్దు దళం చేత  2 మిలియన్ల యాంఫేటమైన్ మాత్రలు పట్టివేత

అల -రాయి: సరిహద్దు దళం శుక్రవారం  2 మిలియన్ల కంటే ఎక్కువ సంఖ్యలో యాంఫేటమైన్ మాదక ద్రవ్య మాత్రలను పట్టుకొన్నారు. టబుకి ప్రాంతంలోని దుబ తీరంలో 2 మిలియన్ యాంఫేటమైన్  మాత్రల కంటే ఎక్కువ సంఖ్యలో ఉన్న వాటిని అక్రమంగా తరలించే ప్రయత్నంలో పట్టుకున్నట్లు బోర్డర్ గార్డ్స్ ప్రతినిధి కల్నల్ సాహిర్ అల్ హర్బి అల్-హయత్ తెలిపారు. తాము ఒక పడవని గుర్తించామని అది సౌదీ జలాలలో ప్రవేశించడాం పసిగట్టామని దాని వెంబడి  అనుసరించామని తెలిపారు. బోర్డు మీద కొందరు ప్లాస్టిక్ సంచులతో  ఈశాన్య దుబ  యొక్క, బీచ్ సమీపంలో నీటిలో పారవేయడం గమనించినట్లు  అల్- హర్బి తెలిపారు. ఆ పడవపై తాము దాడి చేసి పట్టుకొన్నవారిలో ముగ్గురు ఈజిప్టు జాతీయులు ఉన్నారని, ఈ పడవ కోసం తీరంలో మరో పడవతో ఎదురుచూస్తున్న మరో ముగ్గురు సౌదీలను సైతం అదుపులోనికి తీసుకొన్నట్లు ఆయన తెలిపారు. వారి వద్ద నుంచి 2.300.260 యాంఫేటమైన్ మాత్రల అట్టలు మరియు రెండు సంచులలో 9 కిలోగ్రాముల నిషిద్ధ గంజాయిని స్వాధీనం చేసుకొని అక్రమ రవాణాదారులు అరెస్టు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com