రానున్న పదేళ్లలో 1600పైగా విమానాలు భారత గగన తలంలో ....!
- October 10, 2016
భారత్ సొంతంగా విమానాలు రూపొందించుకోవాల్సిన అవసరముందని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మాజీ ఛైర్మన్ ఆర్కే త్యాగీ చెప్పారు. 'పౌర విమానయానంలో భారత్ ఇప్పుడు తొమ్మిదో స్థానంలో ఉంది. 2020 కల్లా మూడో స్థానంలోకొచ్చే అవకాశం ఉందన్న' భారత ఏరోనాటికల్ సొసైటీ వ్యాఖ్యల్ని ఉదహరించారు. 'పౌర, సైనిక వైమానిక రంగంలో, నైపుణ్య అభివృద్ధిలో విస్తరణకు చాలా అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ తన సొంతంగా విమానాలు రూపొందించుకోవాలని' త్యాగీ పేర్కొన్నారు.హెచ్ఏఎల్ ఛైర్మన్గా చేసిన సేవలకు గాను హిందుస్థాన్ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ బహూకరించింది.సొంత విమాన తయారీకి ప్రాథమిక అంచనాలు పూర్తయ్యాయని, 5-7 ఏళ్లలో తయారు చేయవచ్చని తెలిపారు. ఇందుకు ఒక బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని కొన్న దానికన్నా 1 శాతం తక్కువని పేర్కొన్నారు. రానున్న పదేళ్లలో 1600పైగా విమానాలు భారత గగన తలంలో విహరిస్తాయని వీటికి 200 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి ఉంటుందని త్యాగీ అన్నారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









