రానున్న పదేళ్లలో 1600పైగా విమానాలు భారత గగన తలంలో ....!
- October 10, 2016
భారత్ సొంతంగా విమానాలు రూపొందించుకోవాల్సిన అవసరముందని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మాజీ ఛైర్మన్ ఆర్కే త్యాగీ చెప్పారు. 'పౌర విమానయానంలో భారత్ ఇప్పుడు తొమ్మిదో స్థానంలో ఉంది. 2020 కల్లా మూడో స్థానంలోకొచ్చే అవకాశం ఉందన్న' భారత ఏరోనాటికల్ సొసైటీ వ్యాఖ్యల్ని ఉదహరించారు. 'పౌర, సైనిక వైమానిక రంగంలో, నైపుణ్య అభివృద్ధిలో విస్తరణకు చాలా అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ తన సొంతంగా విమానాలు రూపొందించుకోవాలని' త్యాగీ పేర్కొన్నారు.హెచ్ఏఎల్ ఛైర్మన్గా చేసిన సేవలకు గాను హిందుస్థాన్ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ బహూకరించింది.సొంత విమాన తయారీకి ప్రాథమిక అంచనాలు పూర్తయ్యాయని, 5-7 ఏళ్లలో తయారు చేయవచ్చని తెలిపారు. ఇందుకు ఒక బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని కొన్న దానికన్నా 1 శాతం తక్కువని పేర్కొన్నారు. రానున్న పదేళ్లలో 1600పైగా విమానాలు భారత గగన తలంలో విహరిస్తాయని వీటికి 200 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి ఉంటుందని త్యాగీ అన్నారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









