రానున్న పదేళ్లలో 1600పైగా విమానాలు భారత గగన తలంలో ....!
- October 10, 2016
భారత్ సొంతంగా విమానాలు రూపొందించుకోవాల్సిన అవసరముందని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మాజీ ఛైర్మన్ ఆర్కే త్యాగీ చెప్పారు. 'పౌర విమానయానంలో భారత్ ఇప్పుడు తొమ్మిదో స్థానంలో ఉంది. 2020 కల్లా మూడో స్థానంలోకొచ్చే అవకాశం ఉందన్న' భారత ఏరోనాటికల్ సొసైటీ వ్యాఖ్యల్ని ఉదహరించారు. 'పౌర, సైనిక వైమానిక రంగంలో, నైపుణ్య అభివృద్ధిలో విస్తరణకు చాలా అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ తన సొంతంగా విమానాలు రూపొందించుకోవాలని' త్యాగీ పేర్కొన్నారు.హెచ్ఏఎల్ ఛైర్మన్గా చేసిన సేవలకు గాను హిందుస్థాన్ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ బహూకరించింది.సొంత విమాన తయారీకి ప్రాథమిక అంచనాలు పూర్తయ్యాయని, 5-7 ఏళ్లలో తయారు చేయవచ్చని తెలిపారు. ఇందుకు ఒక బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని కొన్న దానికన్నా 1 శాతం తక్కువని పేర్కొన్నారు. రానున్న పదేళ్లలో 1600పైగా విమానాలు భారత గగన తలంలో విహరిస్తాయని వీటికి 200 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి ఉంటుందని త్యాగీ అన్నారు.
తాజా వార్తలు
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు







