ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించనున్న పన్నీర్ సెల్వం
- October 11, 2016తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు నమ్మినబంటుగా ఉన్న ఆర్థిక మంత్రి పన్నీరు సెల్వంకు అమ్మ శాఖలన్నీ అప్పగించారు. కాగా ఇది వరకే ఈయన ముఖ్యమంత్రిగా కూడా పని చేశారు. ప్రస్తుతం ఆయన ఆర్థిక మంత్రిగా అమ్మ కేబినెట్లో ఉన్నారు. అమ్మ తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం విధితమే. దీంతో అమ్మ శాఖలన్నీ పన్నీరు సెల్వంకే అప్పగించారు. ఆర్థిక మంత్రికే అమ్మ శాఖలన్నీ అప్పగిస్తూ రాజ్భవన్ నుంచి కొద్ది సేపటి క్రితం ఉత్తర్వులు జారీ అయ్యాయి. అర్టికల్ 166 ప్రకారం కేబినెట్ సమావేశాలు నిర్వహించేందుకు పన్నీర్ సెల్వంకు అధికారాలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జయలలిత సూచన మేరకే ఆర్థిక మంత్రికి శాఖలు అప్పగించామని రాజ్ భవన్ ఉత్తర్వులో పేర్కొంది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు