హైదరాబాద్‌కు చేరుకున్న హజ్‌యాత్రికులు...

- October 13, 2016 , by Maagulf
హైదరాబాద్‌కు చేరుకున్న హజ్‌యాత్రికులు...

 హజ్‌యాత్రకు వెళ్లిన యాత్రికులంతా క్షేమంగా తిరిగొచ్చారు అని తెలంగాణ స్టేట్‌ హజ్‌ కమిటీ ప్రత్యేకాధికారి ప్రొఫెసర్‌ ఎస్‌ఏ షుకూర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ నుంచి వెళ్లిన వారంతా విజయవంతంగా హజ్‌యాత్ర పూర్తిచేసుకున్నారని, వీరిలో 4873 మంది గురువారం వరకు హైదరాబాద్‌కు చేరుకున్నారని తెలిపారు. ముగ్గురు హజ్‌యాత్రలోనే తుదిశ్వాస విడిచారని... మరో ఆరుగురు ఆనారోగ్య కారణాలతో ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు అని పేర్కొన్నారు. ఇద్దరి వేలిముద్రలు సరిపోలకపోవడంతో ఇబ్బందులున్నాయని... రెండురోజుల్లో ఈ సమస్య పరిష్కారమై వీరంతా హైదరాబాద్‌కు చేరుకుంటారని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com