"చెవిలో పువ్వు" సినీ రచయిత వినయ్ మృతి
- October 13, 2016
పలు చిత్రాలకు కథను అందించిన రచయిత వినయ్ గురువారం హైదరాబాద్లో మృతి చెందారు. సీతాఫల్మండిలో నివాసం ఉంటున్న వినయ్కి బుధవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురికావటంతో కుటుంబసభ్యులు వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చిక్సిత పొందుతున్న వినయ్ గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. వరంగల్ జిల్లాకు చెందిన వినయ్ పలు పత్రికల్లో కథలు, కధానికలు రాశారు. బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న అతనికి హైదరాబాద్కు బదిలీ కావటంతో సినిమాల్లో పనిచేసేందుకు ప్రయత్నించారు. అప్పట్లో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన చెవిలో పువ్వు సినిమాతో రచయితగా అరగ్రేంటం చేశారు. తరువాత అమ్మనా కోడలా, ప్రేమఖైదీ, అమ్మదొంగా తదితర చిత్రాలకు రచయితగా పనిచేశారు.ప్రముఖ దర్శకులు వీవీ వినాయక్, వినయ్ వద్ద శిష్యరికం చేశారు. ఇటీవల సాగర్ దర్శకత్వంలో తెరకెక్కిన క్షుద్ర చిత్రానికి వినయ్ పనిచేసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. వినయ్కి భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







