"చెవిలో పువ్వు" సినీ రచయిత వినయ్‌ మృతి

- October 13, 2016 , by Maagulf

పలు చిత్రాలకు కథను అందించిన రచయిత వినయ్‌ గురువారం హైదరాబాద్‌లో మృతి చెందారు. సీతాఫల్‌మండిలో నివాసం ఉంటున్న వినయ్‌కి బుధవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురికావటంతో కుటుంబసభ్యులు వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చిక్సిత పొందుతున్న వినయ్‌ గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. వరంగల్‌ జిల్లాకు చెందిన వినయ్‌ పలు పత్రికల్లో కథలు, కధానికలు రాశారు. బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న అతనికి హైదరాబాద్‌కు బదిలీ కావటంతో సినిమాల్లో పనిచేసేందుకు ప్రయత్నించారు. అప్పట్లో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన చెవిలో పువ్వు సినిమాతో రచయితగా అరగ్రేంటం చేశారు. తరువాత అమ్మనా కోడలా, ప్రేమఖైదీ, అమ్మదొంగా తదితర చిత్రాలకు రచయితగా పనిచేశారు.ప్రముఖ దర్శకులు వీవీ వినాయక్‌, వినయ్‌ వద్ద శిష్యరికం చేశారు. ఇటీవల సాగర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన క్షుద్ర చిత్రానికి వినయ్‌ పనిచేసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. వినయ్‌కి భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com