రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మోడీ భేటీ

- October 15, 2016 , by Maagulf
రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మోడీ భేటీ

 రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ భేటీ అయ్యారు. బ్రిక్స్‌ సమావేశానికి హాజరయ్యేందుకు పుతిన్‌ నేడు గోవా చేరుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పుతిన్‌కు మోదీ స్వాగతం పలికారు. అనంతరం వీరిద్దరు ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. ఈ భేటీ నేపథ్యంలో భారత్‌, రష్యా మధ్య పలు ఒప్పందాలు జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. అణు విద్యుత్‌, రక్షణ ఒప్పందాలు లాంటి పలు ప్రతిపాదనలపై ఇరువురు చర్చించనున్నారు. తమిళనాడులోని కుడంకుళంలో మరో రెండు రియాక్టర్ల ఏర్పాటుపై ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరే అవకాశమున్నట్లు తెలుస్తోంది. భారత్‌ నేతృత్వంలో గోవా వేదికగా ఎనిమిదో బ్రిక్స్‌ వార్షిక సదస్సు నేటి నుంచి రెండు రోజుల పాటు జరగనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com