భారత్- అమెరికా మిత్ర దేశాలంటున్న ట్రంప్
- October 16, 2016
భారతదేశానికి, హిందువులకు తాను వీరాభిమానినని అంటున్నారు అమెరికా రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్. అమెరికా న్యూజెర్సీలోని రిపబ్లికన్ హిందూ విభాగం నిర్వహించిన ఛారిటీ ఈవెంట్లో ట్రంప్ భారతదేశాన్ని ఉద్దేశిస్తూ ప్రసంగించారు. తానుగానీ అధ్యక్షుడిగా ఎన్నికైతే భారత్-అమెరికాలు మంచి స్నేహితులు అవుతాయి అన్నారు.
ఇరు దేశాల మధ్య మంచి స్నేహాభావమే కాకుండా మెరుగైన సత్సంబంధాలు ఉంటాయని ఇరు దేశాల మధ్య ఆర్ధిక సంస్కరణలపైశ్రద్ధ వహిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీని అభినందించారు.
అధ్యక్ష ఎన్నికల సమయంలో ఓ అధ్యక్ష అభ్యర్ధి ఇండియన్ అమెరికన్ ఈవెంట్కి హాజరుకావడం ఇదే తొలిసారని ప్రవాస భారతీయులు తెలిపారు.
తాను హిందువులకు, భారతదేశానికి పెద్ద అభిమానినని అధ్యక్షుడిగాఎన్నికైతే భారత, హిందూ కమ్యూనిటీకి వైట్హౌస్తో మెరుగైన సత్సంబంధాలు ఉంటాయని, మోదీపై చాలా విశ్వాసముందన్నారు. 19 నెలల క్రితం ఓసారి భారత్ వెళ్లానని మళ్లీ మళ్లీ రావాలని ఉందని తన ప్రసంగంలో ట్రంప్ పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని మట్టుబెట్టేందుకు భారత్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.
తాజా వార్తలు
- ట్రంప్ కీలక నిర్ణయం
- ఊరట.. స్కూల్ ట్రాన్స్ పోర్టు పై 60% ఫీజు తగ్గింపు..!!
- అనధికార న్యాయ సేవలకు వ్యతిరేకంగా ఒమన్ హెచ్చరిక..!!
- ఫ్లైయింగ్ టైగర్ గ్లాసులను వాడొద్దని యూఏఈ హెచ్చరిక..!!
- కువైట్ అమీర్కు క్రెడెన్షియల్స్ సమర్పించిన భారత రాయబారి..!!
- 118 మిలియన్లకు పైగా ఆర్డర్లతో డెలివరీ సెక్టర్ 49% వృద్ధి..!!
- యూఏఈ–ఒమన్ హఫీత్ రైల్ ప్రాజెక్ట్ 40% పూర్తి..!!
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం









