ప్రకాశ్ నిక్కీ నిర్మాతగా...
- October 16, 2016
సంగీత దర్శకులు కథానాయకులుగా మారడం, నిర్మాతలవడం చూస్తున్నాం. ఆ వరుసలో మరో సంగీత దర్శకుడు ప్రకాశ్ నిక్కీ చేరారు. కోయంబత్తూర్కు చెందిన ఈయన కొచ్చిలో సంగీత పాఠాలు చదివారు. ఆ తరువాత ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్.రెహ్మాన్ వద్ద కీబోర్డు ప్లేయర్గా పనిచేశారు. అనంతరం జీవా, శ్రీయ జంటగా నటించిన రౌద్రం చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ చిత్రం మంచి పేరునే తెచ్చిపెట్టింది. ఆ తరువాత కళం చిత్రానికి సంగీతాన్ని అందించిన ప్రకాశ్ నిక్కీకి పలు అవకాశాలు వచ్చినా మంచి కథా చిత్రం కోసం ఎదురు చూస్తుండగా దర్శకుడు విజయ్ కథ చెప్పడానికి వచ్చారట.దీని గురించి ప్రకాశ్ నిక్కీ తెలుపుతూ విజయ్ చెప్పిన కథ చాలా నచ్చేసిందన్నారు.తనే నిర్మాతగా ఆ కథను తెరకెక్కించేందుకు నిర్ణయిం చుకున్నట్లు చెప్పారు. ఇది కొత్త ట్రెండ్లో సాగే క థా చిత్రంగా ఉంటు ందన్నారు. సీనియర్ నటుడు చారుహాసన్ డార్కింగ్ ప్రపంచ డాన్గా ప్రధాన పాత్ర పోషించడం విశేషం అన్నారు. ఆయనతో పాటు మొత్తం 12 పాత్రల చుట్టూ తిరిగే ఈ చిత్రానికి సూదుకవ్వుం చిత్రానికి సహాయ కెమెరామన్గా పనిచేసిన రాజా చాయాగ్రాహకుడిగానూ, లెనిన్ శిష్యుడు సుధ ఎడిటర్గా పరిచయం అవుతున్నారని తెలిపారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









