ప్రకాశ్ నిక్కీ నిర్మాతగా...
- October 16, 2016
సంగీత దర్శకులు కథానాయకులుగా మారడం, నిర్మాతలవడం చూస్తున్నాం. ఆ వరుసలో మరో సంగీత దర్శకుడు ప్రకాశ్ నిక్కీ చేరారు. కోయంబత్తూర్కు చెందిన ఈయన కొచ్చిలో సంగీత పాఠాలు చదివారు. ఆ తరువాత ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్.రెహ్మాన్ వద్ద కీబోర్డు ప్లేయర్గా పనిచేశారు. అనంతరం జీవా, శ్రీయ జంటగా నటించిన రౌద్రం చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ చిత్రం మంచి పేరునే తెచ్చిపెట్టింది. ఆ తరువాత కళం చిత్రానికి సంగీతాన్ని అందించిన ప్రకాశ్ నిక్కీకి పలు అవకాశాలు వచ్చినా మంచి కథా చిత్రం కోసం ఎదురు చూస్తుండగా దర్శకుడు విజయ్ కథ చెప్పడానికి వచ్చారట.దీని గురించి ప్రకాశ్ నిక్కీ తెలుపుతూ విజయ్ చెప్పిన కథ చాలా నచ్చేసిందన్నారు.తనే నిర్మాతగా ఆ కథను తెరకెక్కించేందుకు నిర్ణయిం చుకున్నట్లు చెప్పారు. ఇది కొత్త ట్రెండ్లో సాగే క థా చిత్రంగా ఉంటు ందన్నారు. సీనియర్ నటుడు చారుహాసన్ డార్కింగ్ ప్రపంచ డాన్గా ప్రధాన పాత్ర పోషించడం విశేషం అన్నారు. ఆయనతో పాటు మొత్తం 12 పాత్రల చుట్టూ తిరిగే ఈ చిత్రానికి సూదుకవ్వుం చిత్రానికి సహాయ కెమెరామన్గా పనిచేసిన రాజా చాయాగ్రాహకుడిగానూ, లెనిన్ శిష్యుడు సుధ ఎడిటర్గా పరిచయం అవుతున్నారని తెలిపారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









