మోదీ మైకేల్‌ టెమెర్‌తో భేటీ....

- October 17, 2016 , by Maagulf
మోదీ  మైకేల్‌ టెమెర్‌తో భేటీ....

భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు బ్రెజిల్‌ అధ్యక్షుడు మైకేల్‌ టెమెర్‌తో భేటీ అయ్యారు. బ్రిక్స్‌ సమావేశాల నేపథ్యంలో గోవాలో ఉన్న నేతలు ఈరోజు సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. దేశాధినేతలతో పాటు ఇరు దేశాల ప్రతినిధులు చర్చల్లో పాల్గొన్నారు. భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ కూడా సమావేశంలో పాల్గొన్నారు. గోవా వేదికగా జరిగిన బ్రిక్స్‌ సమావేశాలకు భారత్‌తో పాటు బ్రెజిల్‌, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఉగ్రవాదమే ప్రధాన అజెండాగా సమావేశాలు జరిగాయి. మోదీ ఇప్పటికే చైనా, రష్యా, దక్షిణాఫ్రికా దేశాధినేతలతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com