స్నేహ సంబంధాలలో గొప్ప మైలురాయిని దాటిన యు.ఏ.ఈ. - భారత్
- August 18, 2015
యు.ఏ.ఈ. ప్రధాని, దుబాయి పరిపాలకుడు - హిజ్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, దుబాయి యువరాజు - షేక్ హందాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ మరియు దుబాయి ఉపాధినేత షేక్ మక్తౌమ్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ వారి సమక్షంలో, భారత ప్రధాని నరేంద్ర మోడిని సోమవారం మధ్యాహ్నం జబీల్ రాజభవనంలో స్వాగతించారు. ఇరుదేశాల మధ్య, ప్రజల మధ్య ఉన్న చారిత్రాత్మక గాఢ స్నేహ సంబంధాలను ఆయన నొక్కివక్కాణించారు. భారత ప్రజలకు పెద్దసంఖ్యలో ఆతిధ్యమిస్తున్న తమ అతిగొప్ప మిత్రులుగా యూ. ఏ. ఈ. ని, వారి పాలకులను భారత ప్రధాని అభివర్ణించారు. అనంతరం, ఇరువురు అధినేతలు రెండు దేశాలు, వివిధ వర్గాల ప్రజల మధ్య పరస్పర సహకారాన్ని పెంచడానికి అవసరమైన వ్యూహాత్మక చర్యలను గూర్చి చర్చించారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









