స్నేహ సంబంధాలలో గొప్ప మైలురాయిని దాటిన యు.ఏ.ఈ. - భారత్

- August 18, 2015 , by Maagulf
స్నేహ సంబంధాలలో గొప్ప మైలురాయిని దాటిన యు.ఏ.ఈ. - భారత్

యు.ఏ.ఈ.  ప్రధాని, దుబాయి పరిపాలకుడు - హిజ్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, దుబాయి యువరాజు - షేక్ హందాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ మరియు దుబాయి ఉపాధినేత షేక్ మక్తౌమ్ బిన్  మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ వారి సమక్షంలో, భారత ప్రధాని నరేంద్ర మోడిని సోమవారం మధ్యాహ్నం జబీల్ రాజభవనంలో స్వాగతించారు. ఇరుదేశాల మధ్య, ప్రజల మధ్య ఉన్న చారిత్రాత్మక గాఢ స్నేహ సంబంధాలను ఆయన నొక్కివక్కాణించారు. భారత ప్రజలకు పెద్దసంఖ్యలో ఆతిధ్యమిస్తున్న తమ అతిగొప్ప మిత్రులుగా యూ. ఏ. ఈ. ని, వారి పాలకులను  భారత ప్రధాని అభివర్ణించారు. అనంతరం,  ఇరువురు అధినేతలు రెండు దేశాలు, వివిధ వర్గాల ప్రజల మధ్య పరస్పర సహకారాన్ని పెంచడానికి అవసరమైన వ్యూహాత్మక చర్యలను గూర్చి చర్చించారు.

 

--సి.శ్రీ(దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com