స్నేహ సంబంధాలలో గొప్ప మైలురాయిని దాటిన యు.ఏ.ఈ. - భారత్
- August 18, 2015
యు.ఏ.ఈ. ప్రధాని, దుబాయి పరిపాలకుడు - హిజ్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, దుబాయి యువరాజు - షేక్ హందాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ మరియు దుబాయి ఉపాధినేత షేక్ మక్తౌమ్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ వారి సమక్షంలో, భారత ప్రధాని నరేంద్ర మోడిని సోమవారం మధ్యాహ్నం జబీల్ రాజభవనంలో స్వాగతించారు. ఇరుదేశాల మధ్య, ప్రజల మధ్య ఉన్న చారిత్రాత్మక గాఢ స్నేహ సంబంధాలను ఆయన నొక్కివక్కాణించారు. భారత ప్రజలకు పెద్దసంఖ్యలో ఆతిధ్యమిస్తున్న తమ అతిగొప్ప మిత్రులుగా యూ. ఏ. ఈ. ని, వారి పాలకులను భారత ప్రధాని అభివర్ణించారు. అనంతరం, ఇరువురు అధినేతలు రెండు దేశాలు, వివిధ వర్గాల ప్రజల మధ్య పరస్పర సహకారాన్ని పెంచడానికి అవసరమైన వ్యూహాత్మక చర్యలను గూర్చి చర్చించారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు







