'ఉంగరాల రాంబాబు' గ సు నీల్‌

- October 17, 2016 , by Maagulf
'ఉంగరాల రాంబాబు' గ సు నీల్‌

సు నీల్‌ కథానాయకుడిగా క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి 'ఉంగరాల రాంబాబు' అనే పేరు ఖరారు చేసినట్టు సమాచారం. మలయాళీ భామ మియా జార్జ్‌ కథానాయికగా నటిస్తోంది. దాదాపు 70శాతం చిత్రీకరణ పూర్తయింది. డిసెంబరు 23న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది.

పరుచూరి కిరీటి నిర్మాత. ఆద్యంతం వినోదాత్మకంగా సాగే ఈ చిత్రంలో ఓ చక్కటి సందేశం ఉంటుందని చిత్రబృందం తెలిపింది. 'మళ్ళీ మళ్ళీ ఇది రానీ రోజు' తరవాత క్రాంతి మాధవ్‌ నుంచి వస్తున్న చిత్రమిదే. త్వరలోనే ఫస్ట్‌లుక్‌నీ విడుదల చేయనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com