నాగ్పూర్-సికింద్రాబాద్ రైళ్ల వేగం పెంపుపై అధ్యయనం..
- October 17, 2016
నాగ్పూర్-సికింద్రాబాద్ నగరాల మధ్య రైళ్ల వేగం గంటకు 200 కి.మీలకు పెంచడానికి సంబంధించి తొలి అడుగు పడింది. దీనిపై అధ్యయనానికి రష్యాతో ఒప్పందం కుదిరిందని సోమవారం కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. గోవాలో జరుగుతున్న బ్రిక్స్ సమావేశంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ల మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా ఈ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై భారత రైల్వే బోర్డు ప్రతినిధి నవీన్ కుమార్ శుక్లా, రష్యా రైల్వే శాఖ ప్రతినిధి బెలోజెరోవ్ సంతకాలు చేశారు.నాగ్పూర్-సికింద్రాబాద్ కారిడర్లో నడుస్తున్న రైళ్ల వేగాన్ని గంటకు 200 కిలోమీటర్లకు పెంచడానికి సాంకేతికంగా ఎదురయ్యే ఇబ్బందులు, అవరోధాలపై అధ్యయనం చేస్తారు. ఇందుకు అయ్యే ఖర్చును రెండు దేశాలు సమానంగా భరిస్తాయి.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







