సింధు, మురళీమోహన్‌ లకు పద్మఅవార్డులు...

- October 18, 2016 , by Maagulf
సింధు, మురళీమోహన్‌ లకు పద్మఅవార్డులు...

పద్మా పురస్కరాల కోసం వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల పేర్లను కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఫారసు చేసింది. ప్రముఖ శాస్త్రవేత్త జి.సతీష్‌రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ గురవారెడ్డి, నటుడు, ఎంపీ మురళీమోహన్, ఒలింపిక్ విజేత పీ.వీ సింధు, మరో క్రీడాకారుడు శ్రీకాంత్‌తో పాటు కళారంగం నుంచి ప్రముఖ మృదంగ విద్వాంసుడు యెల్లా వెంకటేశ్వరరావు, నర్తకి ఆనంద్ శంకర్‌జయంత్, ప్రముఖ డాక్టర్ సికె దుర్గ పేర్లను పద్మభూషణ్ పురస్కరాలకు నామినేట్ చేసింది. అలాగే ప్రముఖ ఈఎన్‌టి స్పెషలిస్ట్ విష్ణు స్వరూప్‌రెడ్డితో పాటు చేనేత రంగ ప్రముఖుడు రమణయ్య పేర్లను పద్మశ్రీకి సిఫారసు చేసింది. మొత్తం 22మంది ప్రముఖుల పేర్లతో కూడిన జాబితాను కేంద్రానికి పంపింది.
గణతంత్రదినోత్సవం రోజు ప్రముఖులకు కేంద్రం ఈ పద్మఅవార్డులను ప్రకటించనుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com