ప్రముఖ మలయాళ నటుడు సురేశ్ గోపి బీజేపీలో చేరారు...
- October 19, 2016
ప్రముఖ మలయాళ నటుడు, రాజ్యసభ సభ్యుడు సురేశ్ గోపి బుధవారం బీజేపీలో చేరారు. ఏప్రిల్ లో కేంద్రం ప్రభుత్వం ఆయనను రాజ్యసభకు నామినేట్ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా మద్దతుతో ఆయన పెద్దల సభలో అడుగు పెట్టారు. అప్పుడే ఆయనకు కేంద్ర మంత్రి పదవి దక్కుతుందని వార్తలు వచ్చాయి. అయితే అప్పటికి ఆయన బీజేపీలో చేరలేదు. ఇటీవల జరిగిన కేరళ ఎన్నికల్లో తిరువనంతపురం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆయన్ని ఎన్నికల బరిలో నిలపాలని భావించగా, పోటీ చేసేందుకు సురేశ్ గోపి విముఖత వ్యక్తం చేశారు.2014 వరకు కాంగ్రెస్ మద్దతుదారుడిగా ఆయన తర్వాత తన వైఖరి మార్చుకున్నారు. అవినీతిని అరికట్టడంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం విఫలమైందని విమర్శలు గుప్పించారు.57 ఏళ్ల సురేశ్ గోపి నటుడిగా కొనసాగుతూనే సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి. బీజేపీలో చేరడం ద్వారా ఆయన క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







