లింగమార్పిడి శస్త్రచికిత్సలను నిర్వహిస్తున్న 37 మంది ఆసియా ప్రవాసీయులు
- October 21, 2016కువైట్ సిటీ : స్థానిక మఃబౌల ప్రాంతంలో ఒక నకిలీ దేశీయ కార్మిక కార్యాలయం నిర్వహిస్తూ, కువైట్ పౌరులు మోసగిస్తున్న 37 మంది ఆసియా దేశస్థుల సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారు అక్కడ కొనసాగిస్తున్నఅక్రమ కార్యకలాపాల గురించి సమాచారం అందుకొని రెసిడెన్సీ వ్యవహారాల జనరల్ డైరెక్టరేట్ కార్యాలయం నుంచి ఒక జట్టు వీరిపై పరిశోధనలు కోసం ఏర్పాటు చేయబడింది. వారిని పెట్టుకొనేందుకు ఒక ఉచ్చు ఏర్పాటు చేయబడింది. అనుమానితులను అరెస్టు చేసి అవసరమైన చట్టబద్ధమైన చర్యల కోసం సంబంధిత అధికారులు సూచించారు.ముగ్గురు ఆసియా దేశాలకు చెందిన ప్రవాసీయ వ్యక్తులు చట్టవిరుద్ధంగా కొందరకి లింగమార్పిడి శాస్త్రచికిత్స, ప్లాస్టిక్ సర్జరీలు అక్రమంగా చేస్తున్నందుకు వారిని అరెస్టు చేశారు. ఇంస్టాగ్రామ్ ద్వారా ప్రకటనల గురించి సమాచారాన్ని పొందిన తర్వాత వారి కదలికలపై సమగ్ర పరిశోధనలను జరిపి వారిని అరెస్ట్ చేశారు వారికి ఎటువంటి అర్హత కల్గిన వైద్య సర్టిఫికెట్లు లేకపోయినప్పటికీ వారు పలు శస్త్రచికిత్సలు ఎన్నో జరిపారు. ఈ తరహా లింగమార్పిడి శస్త్రచికిత్సలు ఎన్నో చేసినట్లు వారు తమ తప్పుని ఒప్పుకున్నారు. దీనితో అవసరమైన చర్యల కోసం సంబంధిత అధికారులు కేసులు నమోదు చేశారు.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్