బస్ ఫేర్ కోసం ఆర్టిఎ స్మార్ట్ సిస్టమ్
- October 21, 2016
దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, కొత్తగా ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ (పిఓసి) అనే విధానం ద్వారా ప్రయాణీకులు పబ్లిక్ బస్ ట్రిప్లను ఎలాంటి కార్డులు లేకుండా వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తోంది. ఆర్టిఎ ఈ విషయాన్ని 36వ జిటెక్స్ టెక్నాలజీ వీక్లో వెల్లడించింది. బి ఇన్ - బి ఔట్ అనే కాన్సెప్ట్లో ఈ కొత్త విధానం ద్వారా టికెటింగ్ జరుగుతుంది. 'బిబో'గా దీన్ని పరిగణించనున్నారు. ఈ విధానం ద్వారా ప్రయాణీకుడు బస్లోకి స్మార్ట్ కార్డ్, స్మార్ట్ ఫోన్ని తన వద్ద ఉంచుకుంటే సరిపోతుంది. కార్డ్ని స్వైప్ చేయడం లేదా స్మార్ట్ ఫోన్ని వినియోగించడం చేయనక్కర్లేదు. బిబో సిస్టమ్ ఆ స్మార్ట్ కార్డ్ లేదా స్మార్ట్ ఫోన్ని రీడ్ చేసి, తనంతట తానుగా ఫేర్ని కలెక్ట్ చేస్తుంది. ఎన్ఓఎల్ కార్డు ద్వారా పంచ్ చేసే విధానానికి ఈ బిబో సిస్టమ్ ద్వారా చెక్ పెట్టవచ్చు. తద్వారా క్లియర్గా ఫేర్ కలెక్షన్ జరగడంతోపాటుగా సమయం కూడా వృధా అవకుండా ఉంటుంది. స్మార్ట్ దుబాయ్ ప్రాజెక్ట్లో భాగంగా ఈ స్మార్ట్ బిబో సిస్టమ్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









