మహిళా విద్యార్ధుల మధ్య తగాదా... కళాశాలలో ' సెంటు బుడ్డీల సమరం '
- October 21, 2016
కువైట్: " నాలుగు కొప్పులు కలిస్తే ప్రళయమే " అన్న మన తెలుగు సామెత కువైట్ లోనూ సరిగ్గా సరిపోతుంది. మరి వారే కలహిస్తే , గుమ గుమ లాడే సువాసనల మధ్య గుభీ గుభీ మంటూ గుద్దులాటతో మహిళా కళాశాల మారుమోగిపోతుంది. వివరాలలోకి వెళితే కువైట్ ప్రాథమిక విద్య కళాశాలలో చదువుతున్న ఓ నలుగురు మహిళా విద్యార్థులు ఇటీవల కళాశాలలో జరిగిన 'ఎన్నికల ఫలితాలు పై తీవ్రంగా చర్చ జరుపుతున్నారు. ఆ సందర్భంగా వారి మధ్య చిచ్చు చెలరేగింది. దాంతో వారు తమ బ్యాగులలో ఉన్న సెంటు సీసాలు..ఆయుధాలుగా మారిపోయాయి... ప్రత్యర్థులపై పరిమళం సీసాలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకొంటూ..కాసేపు కళాశాలను మినీ కురుక్షేత్రం చేశారు. ఆ సెంటు బుడ్డీల సమరంలో గాయపడిన ఓ మహిళా విద్యార్థిని ఆస్పత్రి పాలయ్యంది. మిగిలిన స్టూడెంట్స్ వీరి పోరాటం విచ్ఛిన్నం చేయడానికి నీటిని ఉపయోగించి నిలువరించారు . మిగిలిన ముగ్గురు విదార్థినులను కళాశాలలోనే చికిత్స కోసం చేర్పించారు . పోలీసులను కాలేజీ క్యాంపస్ లోనికి అనుమతించకపోవడంతో కదనరంగం కాసేపు కొనసాగింది..తోటి మహిళా విద్యార్థులు ఆ మహిళా యోధులపై నీటిని బలంగా పిచికారీ చేసి విడదీశారు. అప్పటివరకు పోలీసులు నిస్సహాయులుగా ఉండి వెలుపలే నిరీక్షిస్తూ ఉండిపోయారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







