మరోసారి వెంకీ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన తేజస్విని
- October 23, 2016
ఒక్కసారి.. ఇంకొక్కసారి అంటూ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబును టీజ్ చేసిన తేజస్వి మదివాడ.. మరోసారి వెంకటేష్ తో కలిసి నటించే ఛాన్స్ కొట్టేసింది. సీతమ్మ సినిమా తర్వాత వెంకటేష్ తో కలిసి నటించే అవకాశాన్ని మరోసారి దక్కించుకుంది ఈ తెలుగు బ్యూటీ.బాబు బంగారం' సినిమా తరువాత నుంచి వెంకటేష్ బాబు కాస్త దూకుడు పెంచాడు. వరుసగా సినిమాలను అంగీకరించడమే కాకుండా, సాధ్యమైనంత త్వరగా వాటిని పూర్తిచేయడానికి కూడా ప్రయత్నిస్తున్నాడు. ఆయన తాజా చిత్రంగా 'గురు' రూపొందుతోంది.ఈ సినిమాను, సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.తరువాత ఆయన కిషోర్ తిరుమలతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఈ సినిమాకి 'ఆడాళ్లూ మీకు జోహార్లు' అనే టైటిల్ ను ఖరారు చేశారు. కథాపరంగా ఇందులో నలుగురు కథానాయికలతో వెంకటేష్ రొమాన్స్ చేయనున్నాడట.ఒక హీరోయిన్ గా నిత్యామీనన్ ను .. మరోహీరోయిన్ గా అనసూయను సెలెక్ట్ చేసిన ఈ సినిమా టీమ్, తాజాగా 'తేజస్వి'ని మూడో హీరోయిన్ గా ఎంపిక చేసిందట.ఈ మూవీలో తన కంటే వయసులో చాలా చిన్నదైన అమ్మాయిని చేసుకోవాల్సి వచ్చే వ్యక్తిగా వెంకటేష్ నటించనున్నాడు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన – బహ్రెయిన్లో మోగిన సైరన్ల�
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!







