వరుస పేలుళ్లు తో మణిపూర్....
- October 23, 2016
మణిపూర్ రాష్ట్రంలోని ఉక్రుల్ ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మణిపూర్ ముఖ్యమంత్రి ఒక్రం ఇబోబీ సింగ్ పర్యటన నేపథ్యంలో ఈ పేలుడు చోటుచేసుకోవడం స్థానికంగా కలకలం సృష్టించింది.
గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. ఘటన స్థలం వద్ద భారీగా మోహరించారు. సీఎం పర్యటన నేపథ్యంలో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. కాగా, ఆదివారం కూడా ఇదే ప్రాంతంలో ఓ హ్యాండ్ గ్రనేడ్ గుర్తించిన పోలీసులు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి పేల్చేశారు.
పాక్ సైన్యం కాల్పుల్లో జవాను మృతి
శ్రీనగర్: దేశ సరిహద్దుల్లో పాక్ సైన్యం మరోసారి కాల్పులకు తెగబడింది.
జమ్మూకాశ్మీర్లోని ఆర్ఎస్ పురా, పర్గ్వాల్, కనాచక్ ప్రాంతాల్లోని సైనిక శిబిరాలపై పాక్ సైన్యం పలుమార్లు కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో ఓ జవాను ప్రాణాలు కోల్పోగా, మరొకరు గాయపడ్డారు.
తాజా వార్తలు
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!
- రియాద్కు భారీ వర్ష సూచన..!!
- ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!
- ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న కువైట్..!!
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?









